Share News

Hyderabad: నేటినుంచి మేడారానికి ఆర్టీసీ బస్సులు

ABN , Publish Date - Feb 09 , 2024 | 12:56 PM

మేడారం(Medaram) మహాజాతరను పురస్కరించుకుని ఈనెల 9నుంచి రోజూ మూడు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు రంగారెడ్డి రీజినల్‌ మేనేజర్‌ ఎ.శ్రీధర్‌ తెలిపారు.

Hyderabad: నేటినుంచి మేడారానికి ఆర్టీసీ బస్సులు

హైదరాబాద్: మేడారం(Medaram) మహాజాతరను పురస్కరించుకుని ఈనెల 9నుంచి రోజూ మూడు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు రంగారెడ్డి రీజినల్‌ మేనేజర్‌ ఎ.శ్రీధర్‌ తెలిపారు. ఈ మూడు సూపర్‌ లగ్జరీ బస్సులు ఎంజీబీఎస్‌ నుంచి ఉదయం 6గంటలకు, 6.30 గంటలకు, జేబీఎస్‌ నుంచి ఉదయం 7గంటలకు బయల్దేరుతాయని ఆయన వివరించారు. ఉప్పల్‌, హన్మకొండ, వరంగల్‌(Uppal, Hanmakonda, Warangal) మీదుగా మేడారం చేరుకుంటాయని, తిరిగి మేడారం నుంచి మధ్యాహ్నం 2గంటలకు, 2.30 గంటలకు, 3 గంటలకు బయల్దేరుతాయని ఆర్‌ఎం తెలిపారు. పెద్దలకు రూ.750లు, పిల్లలకు రూ.450లు చార్జీలని, ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్‌ చేసుకోవచ్చని తెలిపారు.

Updated Date - Feb 09 , 2024 | 12:57 PM