Share News

Hyderabad: ఆర్టీసీ ‘ఉచిత’ టికెట్లు 8 కోట్లు.. ‘మహాలక్ష్మి’తో కిక్కిరిసిపోతున్న ఆర్టీసీ బస్సులు

ABN , Publish Date - Feb 29 , 2024 | 01:53 PM

మహాలక్ష్మి పథకం(Mahalakshmi Scheme) కింద గ్రేటర్‌జోన్‌లో ఇప్పటి వరకు ఆర్టీసీ 8 కోట్ల ఉచిత ప్రయాణ టికెట్లను జారీ చేసింది. సోమవారం రికార్డుస్థాయిలో 12 లక్షల మంది మహిళలు జీరో టికెట్లతో బస్సుల్లో ప్రయాణించారు.

Hyderabad: ఆర్టీసీ ‘ఉచిత’ టికెట్లు 8 కోట్లు.. ‘మహాలక్ష్మి’తో కిక్కిరిసిపోతున్న ఆర్టీసీ బస్సులు

హైదరాబాద్‌ సిటీ: మహాలక్ష్మి పథకం(Mahalakshmi Scheme) కింద గ్రేటర్‌జోన్‌లో ఇప్పటి వరకు ఆర్టీసీ 8 కోట్ల ఉచిత ప్రయాణ టికెట్లను జారీ చేసింది. సోమవారం రికార్డుస్థాయిలో 12 లక్షల మంది మహిళలు జీరో టికెట్లతో బస్సుల్లో ప్రయాణించారు. బస్సుల సంఖ్య పెంచితే ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంటుందని ఆ దిశగా ప్రభుత్వం, టీఎస్‌ ఆర్టీసీ చర్యలు తీసుకోవాలని రవాణారంగ నిపుణులు సూచిస్తున్నారు. ఉచిత ప్రయాణంతో గ్రేటర్‌లో ఆర్టీసీ బస్సుల ఆక్యుపెన్సీ 100 శాతానికి చేరింది. అంతకు ముందు 70 శాతం మాత్రమే ఉండేది.

Updated Date - Feb 29 , 2024 | 01:53 PM