Share News

Secunderabad: నిర్మానుష్యంగా సికింద్రాబాద్.. కొనసాగుతున్న బంద్

ABN , Publish Date - Oct 19 , 2024 | 02:30 PM

సికింద్రాబాద్ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారింది. వీరంతా కలిసి మహంకాళి టెంపుల్ నుంచి విగ్రహం ధ్వంసం అయినా టెంపుల్ వరకు ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Secunderabad: నిర్మానుష్యంగా సికింద్రాబాద్.. కొనసాగుతున్న బంద్
bandh

సికింద్రాబాద్: అమ్మవారి విగ్రహం ధ్వంసంకు నిరసనగా సికింద్రాబాద్ లో స్థానికులు బంద్ కు పిలుపునిచ్చారు. అక్కడి వ్యాపారులు, స్థానికులు స్వచ్ఛందంగా బంద్ పాటించడంతో సికింద్రాబాద్ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారింది. వీరంతా కలిసి మహంకాళి టెంపుల్ నుంచి విగ్రహం ధ్వంసం అయినా టెంపుల్ వరకు ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా చర్యలకు సిద్ధమయ్యారు. సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.


ముంబై నుంచి వచ్చి..

ఈ నెల 14న తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించి గర్భగుడి తాళం పగులగొట్టాడు. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. గుడిపైకి చేరుకొని పైన ఉన్న విగ్రహాన్ని పగులగొట్టటానికి యత్నించాడు. స్థానికుడు ఒకరు గమనించి ఆగంతకుడ్ని పట్టుకున్నాడు. ఈలోపు మరికొందరు స్థానికులు చేరుకొని ఆగ్రహావేశాలతో నిందితుడిపై దాడి చేశారు. స్థానిక మార్కెట్‌ పోలీసులకు నిందితుడిని అప్పగించారు. గాయాలపాలైన అతడిని పోలీసులు ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయించారు. ఆ తర్వాత విచారణ చేయగా అతను ముంబైకి చెందినవాడని, పేరు సల్మాన్‌ అని అతడు గ్రాడ్యుయేట్‌ అని తేలింది. నిందితుడు పోలీసులు అదుపులో ఉన్నాడు.


గతంలోనూ కేసులు..

సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే సల్మాన్‌ దేశం నుంచి పారిపోయి విదేశాల్లో తలదాచుకున్న జకీర్‌ నాయక్‌, ఇతర ఇస్లామిక్‌ మతబోధకుల వీడియోలు చూసి ప్రభావితమయ్యాడు. హిందూ మతం, ఆచార వ్యవహారాలు, విగ్రహారాధనపై ద్వేషం పెంచుకుని ఉద్రేకానికి లోనయ్యేవాడు. ఈ క్రమంలోనే 2022లో ముంబై ఆరే సబ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ గణేశ్‌ మండపంలోకి చెప్పులతో ప్రవేశించాడు. విగ్రహారాధనను అపహాస్యం చేసి, అక్కడి వ్యక్తులతో వాదనకు దిగాడు. దాంతో అతనిపై కేసు నమోదైంది. ఈ ఏడాది జనవరిలో శ్రీమనోకామన సిద్ధి మహదేవ్‌ మందిరంలోకి ప్రవేశించి శంకరభగవానుడి విగ్రహాన్ని కాలితో ధ్వంసం చేసి, హిందూ మత విశ్వాసాలను అవమానించాడు. దాంతో మిరా భాయీందర్‌ వసాయి విరార్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.


వ్యక్తిత్వ వికాసం ముసుగులో

సికింద్రాబాద్‌ మెట్రోపాలిస్‌ హోటల్లో ఈ నెల 1 నుంచి 31 వరకు మునావర్‌ జమా అనే వక్త (మోటివేషనల్‌ స్పీకర్‌) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మత విద్వేషాలను రెచ్చగొట్టే సదస్సుకు సల్మాన్‌ హాజరైనట్లు పోలీసుల విచారణలో తేలింది. 151 మంది మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి ఈ సదస్సుకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 49 గదుల్లో వారికి బస ఏర్పాటు చేసినట్లు తేలింది. దీంతో గోపాలపురం పోలీసులు మునావర్‌ జమా తో పాటు హోటల్‌ యజమాని అబ్దుల్‌ రషీద్‌ బషీ ర్‌ అహ్మద్‌, మేనేజర్‌ రెహ్మాన్‌పై కేసు నమోదు చేశారు. మునావర్‌ జమా మతం పేరుతో వివిధ వర్గాల మధ్య శత్రుత్వం పెంచుతున్నాడని, ముస్లింలను రెచ్చగొడుతున్నాడని పోలీసులు పేర్కొన్నారు.

Updated Date - Oct 19 , 2024 | 02:30 PM