Share News

Viral: దారుణం.. బిర్యానీలో కప్ప కళేబరం

ABN , Publish Date - Oct 20 , 2024 | 06:20 PM

గచ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీలోని మెస్‌లో వడ్డించిన చికెన్‌ బిర్యానీలో కప్ప కనిపించింది. దీంతో కంగుతిన్న విద్యార్థులు మెస్‌ ఇన్‌ఛార్జికి ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Viral: దారుణం.. బిర్యానీలో కప్ప కళేబరం

హైదరాబాద్‌: హైదరాబాదీలకు చికెన్ బిర్యానీ అంటే ఎంత ఇష్టమో వేరే చెప్పాలా. చిన్న పార్టీ అయినా బిర్యానీ ఉండాల్సిందే. అందులోనూ హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టపడేవారు కోకొల్లలు. బిర్యానీ తయారీ పద్ధతి, అందులో వాడే వంట మసాలాలే దానికి అంత రుచిని తీసుకువస్తాయి. సాధారణంగా బిర్యానీలో పుదీనా, కొత్తిమీర, దాల్చిన చెక్క, లవంగాలు సహా తదితర సుగంధ ద్రవ్యాలు వేస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో కొందరు బల్లులు, జెర్రీలు, బొద్దింకలు, పురుగులు తదితర కీటకాలు వేసి చేస్తు్న్నారు. తెలుగు రాష్ట్రాల్లో నిత్యం ఏదో ఓ చోట ఈ తంతు జరుగుతూనే ఉంది.

ఈ మధ్యే హైదరాబాద్‌లోని ప్రముఖ రెస్టారెంట్‌లోని బిర్యానీలో జెర్రి బయటపడిన ఘటన కలకలం రేపింది. ఇప్పుడు ఏకంగా కప్పను వేసి ఉడికించారు. హోటల్‌లో, రెస్టారెంటో అనుకునేరు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ఐటీ మెస్‌లో. గచ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీలోని మెస్‌లో వడ్డించిన చికెన్‌ బిర్యానీలో కప్ప కనిపించింది. దీంతో కంగుతిన్న విద్యార్థులు మెస్‌ ఇన్‌ఛార్జికి ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ ఫొటోను ‘ఎక్స్‌’లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ నెల 16న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


చర్యలు తీసుకోండి..

ట్రిపుల్‌ఐటీలోని కదంబ మెస్‌లో విద్యార్థులకు అక్టోబర్ 17న బిర్యానీ పెట్టారు. అయితే.. ఓ విద్యార్థికి వడ్డించిన బిర్యానీలో చికెన్ ముక్కతోపాటు కప్ప కూడా వచ్చింది. అది చూసి ఒక్కసారిగా విద్యార్థి షాక్‌కి గురయ్యాడు. చికెన్‌తో పాటే ఆ కప్పను కూడా మసాలాతో కలిపి ధమ్ పెట్టినట్టుగా అర్థమవుతోంది. దీంతో సదరు విద్యార్థి మెస్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్యాంపస్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెస్‌ నిర్వాహకుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని మండిపడుతున్నారు.


కప్ప ఉన్న విషయాన్ని గుర్తించలేని నిర్వాహకులు ఉన్నారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మెస్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తమ ఆరోగ్యాలకు ఎవరు గ్యారంటీ ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. బిర్యానీలో కప్ప ఉన్న ఫొటోను ఎక్స్ అకౌంట్లో షేర్ చేశారు. అనంతరం తెలంగాణ ఫుడ్‌సేఫ్టీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తరచూ ఇలాంటి ఘటనలు బయటపడుతుండటంతో హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో బయటి ఆహారం తినాలంటే ప్రజలు జంకుతున్నారు. ఇంట్లో వండుకుని తినే ఆహారం అన్ని విధాల శ్రేయస్కరమని నిపుణులు చెబుతున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

ABN Effect: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరస కథనాలతో HMDA అధికారుల్లో కదలిక..

Group-1 Exam: మరోసారి రోడ్డెక్కిన గ్రూప్-1 బాధితులు.. అశోక్‌నగర్‌లో ఉద్రిక్తత..

HYDRA: హైడ్రా చీఫ్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు

For Telangana News And Telugu News...

Updated Date - Oct 20 , 2024 | 06:20 PM