ఐపీఎస్ నేతృత్వంలో ‘ఆస్తుల పరిరక్షణ విభాగం’?ఐపీఎస్ నేతృత్వంలో ‘ఆస్తుల పరిరక్షణ విభాగం’?
ABN , Publish Date - Jun 26 , 2024 | 06:15 AM
హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సీనియర్ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో ‘ఆస్తుల పరిరక్షణ విభాగం పేరుతో ప్రత్యేక వింగ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.
హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సీనియర్ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో ‘ఆస్తుల పరిరక్షణ విభాగం పేరుతో ప్రత్యేక వింగ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలోని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడటంతోపాటు ఇప్పటికే ఆక్రమణలకు గురైన ప్రభుత్వ ఆస్తుల్ని గుర్తించి స్వాధీనం చేసుకోవడంలో నూతన విభాగం కీలకంగా పని చేయనుంది. మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో నూతన విభాగం ఏర్పాటుకు సంబంధించి త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి.