Share News

CM Revanth Reddy: జగన్ కాదంటే షర్మిలతో వారికి టికెట్ ఇప్పిస్తా: రేవంత్ రెడ్డి

ABN , Publish Date - Jan 06 , 2024 | 09:39 PM

ఏపీలో సీఎం జగన్ టికెట్ ఇవ్వని వారికి కాంగ్రెస్ తరఫున తాను టికెట్ ఇప్పిస్తానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏబీఎన్ బిగ్ డిబేట్‌లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఢిల్లీలో తానిచ్చిన పార్టీకి వైసీపీ నేతలు హాజరవడం, అలా హాజరవైన వారిని ఏపీ సీఎం జగన్ తిట్టడంపై స్పందించారు.

CM Revanth Reddy: జగన్ కాదంటే షర్మిలతో వారికి టికెట్ ఇప్పిస్తా: రేవంత్ రెడ్డి
CM Revanth Reddy First Interview

CM Revanth Reddy First Interview With ABN MD RK: ఏపీలో సీఎం జగన్ టికెట్ ఇవ్వని వారికి కాంగ్రెస్ తరఫున తాను టికెట్ ఇప్పిస్తానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏబీఎన్ బిగ్ డిబేట్‌లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఢిల్లీలో తానిచ్చిన పార్టీకి వైసీపీ నేతలు హాజరవడం, అలా హాజరవైన వారిని ఏపీ సీఎం జగన్ తిట్టడంపై స్పందించారు. తాజాగా ఆ ఎంపీలకు క్లాస్ తీసుకున్నట్లు ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ గుర్తు చేయగా.. జగన్ కాకపోతే తాము ఉంటామని రేవంత్ రెడ్డి అన్నారు. అంతేకాదు.. ఇటీవల ఓ ఎంపీ వెళ్లి జగన్‌ను టికెట్ అడిగితే వెళ్లి రేవంత్ రెడ్డిని అడుక్కోపో అన్నారని ప్రస్తావించగా.. తమ దగ్గరకు వస్తే టికెట్ ఇస్తామని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. ఏపీలో తమకు కూడా 25 ఎంపీలు, 175 ఎమ్మెల్యే టికెట్లు ఉన్నాయి కదా అని పేర్కొన్నారు. ఏపీ కాంగ్రెస్‌లో షర్మిలమ్మతోనే ఇప్పిస్తానని అన్నారు రేవంత్ రెడ్డి. 'ఏపీలో జగన్‌కు, చంద్రబాబుకు ఎన్ని బీఫామ్‌లు ఉన్నాయో.. తమకూ అన్నే ఉన్నాయి కదా అని బదులిచ్చారు రేవంత్ రెడ్డి. 2 ఎంపీ సీట్లు ఉన్న బీజేపీ ఇవాళ 302 సీట్లకు ఎదగలేదా.. తెలంగాణ కాంగ్రెస్ పని ఖతం అని అన్నారు.. ఇవాళ అధికారం చేపట్టలేదా?.. ఏపీలోనూ కాలం కలిసొస్తే కాంగ్రెస్ అధికారం చేపట్టే ఛాన్స్ ఉంది.' అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Updated Date - Jan 06 , 2024 | 09:39 PM