Share News

TS News: నాంపల్లి కాల్పుల ఘటనపై కీలక అప్డేట్

ABN , Publish Date - Jul 12 , 2024 | 08:20 AM

గత అర్థరాత్రి హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద కాల్పుల ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ముగ్గురు దుండగులు తమపై దాడికి యత్నించగా.. పోలీసుల వారిపై కాల్పులు జరిపారు

TS News: నాంపల్లి కాల్పుల ఘటనపై కీలక అప్డేట్

హైదరాబాద్: గత అర్థరాత్రి హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద కాల్పుల ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ముగ్గురు దుండగులు తమపై దాడికి యత్నించగా.. పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. అయితే పోలీసులపై దాడి చేసిన వారు మాంగర్ బస్తికి చెందిన వారుగా గుర్తించడం జరిగింది. పోలీసులపై దాడి చేస్తుండగా సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఫైరింగ్ నిర్వహించారు. ఈ ఘటనలో రాజు అనే వ్యక్తికి కుడి వైపు తొడలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఉస్మానియాకి తరలించారు. నిందితుడికి చికిత్స నిర్వహించిన ఉస్మానియా వైద్యులు అతని శరీరం నుంచి బుల్లెట్‌ను తొలగించారు.


పోలీసులకు మరో నిందితుడు ఆగాపురకు చెందిన అయ్యాన్ సైతం చిక్కాడు. ప్రస్తుతం అతను నాంపల్లిపోలీసుల అదుపులో ఉన్నాడు. అసలు వీరు ఎవరు? ఏం చేస్తుంటారు? ఎందుకు నాంపల్లి స్టేషన్ పరిసరాల్లో తిరుగుతున్నారు? పైగా ఎందుకు గొడ్డలితో తిరుగుతున్నారనే విషయాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. పారిపోయిన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. తమపై ఒకరు గొడ్డలితో మరో ఇద్దరు రాళ్లతో దాడి చేయడంతో ఆత్మ రక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారు. ఆ ముగ్గురినీ దోపిడీ దొంగల ముఠాగా పోలీస్ డెకాయ్ టీమ్ అనుమానిస్తోంది.

అనుమానాలకు తెర..!

Read more Telangana News and Telugu News

Updated Date - Jul 12 , 2024 | 08:20 AM