JNTU: 2 నుంచి సాయంకాలం బీటెక్ తరగతులు ప్రారంభం
ABN , Publish Date - Dec 01 , 2024 | 04:10 AM
సాయంకాలం బీటెక్లో ప్రవేశాలు పొందిన వర్కింగ్ ప్రొఫెషనల్స్కు డిసెంబరు 2 నుంచి తరగతులు ప్రారంభిస్తున్నట్లు జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ జీవీ నర్సింహారెడ్డి తెలిపారు.
![JNTU: 2 నుంచి సాయంకాలం బీటెక్ తరగతులు ప్రారంభం](https://media.andhrajyothy.com/media/2024/20241122/16_539dd50fb2_v_jpg.webp)
జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ వెల్లడి
హైదరాబాద్ సిటీ, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): సాయంకాలం బీటెక్లో ప్రవేశాలు పొందిన వర్కింగ్ ప్రొఫెషనల్స్కు డిసెంబరు 2 నుంచి తరగతులు ప్రారంభిస్తున్నట్లు జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ జీవీ నర్సింహారెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రవేశాలు పొందిన అభ్యర్థులకు సమాచారమిచ్చినట్టు చెప్పారు. ఈవెనింగ్ బీటెక్ అకడమిక్ క్యాలెండర్ను ఆయన శనివారం విడుదల చేశారు. వర్సిటీలోని మెకానికల్, మెటలర్జీ విభాగాల్లో ఈ ఏడాది నుంచి కొత్తగా ఈవెనింగ్ బీటెక్ ప్రోగ్రామ్ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 4వరకు మొదటి సెమిస్టర్ కొనసాగుతుందని, సెకండ్ సెమిస్టర్ జూన్ 2న ప్రారంభమై అక్టోబరు 18తో ముగుస్తుందన్నారు. సాయంకాలం బీటెక్ రెండో సంవత్సరం తరగతులను 2025 నవంబరు 3 నుంచి ప్రారంభిస్తామని ప్రిన్సిపాల్ తెలిపారు.