Share News

అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Oct 24 , 2024 | 12:52 AM

సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తూ ముందుకు సాగుతుందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాగూర్‌ అన్నారు.

అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

అంతర్గాం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తూ ముందుకు సాగుతుందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాగూర్‌ అన్నారు. బుదవారం రామగుండం పట్టణంలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఈ మేరకు మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలను అమలుచేస్తోందన్నారు. రామగుండం పారిశ్రా మిక ప్రాంతాన్ని అభివృద్ది పథంలో పయనిం పచేసేందుకు రుడా ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. అదనపు కలెక్ట ర్‌ శ్యామ్‌ప్రసాద్‌లాల్‌, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌జనరల్‌ రవీందర్‌, జిల్లా రిజిస్ట్రార్‌ ప్రవీణ్‌కుమార్‌, మేయర్‌ అనిల్‌ కుమార్‌, ఏసీపీ రమేష్‌, సీఐ ప్రవీణ్‌ కుమార్‌, సబ్‌ రిజిష్టర్‌ బదావత్‌ తిరుపతి, కార్పొరేటర్‌ కన్నూరి సతీష్‌ కుమార్‌, కాంగ్రెస్‌ నాయకులు మహంకాళి స్వామి, బుగ్గ రాములుగౌడ్‌, సిం గం కిరణ్‌కుమార్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 24 , 2024 | 12:52 AM