భూగర్భ జలాలు పెంపొందించడం అందరి బాధ్యత
ABN , Publish Date - Apr 19 , 2024 | 12:18 AM
భూగర్భ జలాలను పెంపోందించడం మనం దరి బాధ్యత అని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ అన్నారు.
పెద్దపల్లి, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): భూగర్భ జలాలను పెంపోందించడం మనం దరి బాధ్యత అని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ అన్నారు. గురువారం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కలెక్టరేట్ ప్రాంగణంలో అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి ఇంకుడు గుంత ల నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముజమ్మి ల్ఖాన్ మాట్లాడుతూ రాబోయే వర్షాకాలంలో కురిసే ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడి సి పట్టుకుని భూగర్భ జలాలను పెంపొందించుకోవడం చాలా ముఖ్యమని అన్నారు. కలెక్టరేట్ వద్ద వర్షపు నీటిని ఇంకేలా చేసేందుకు వీలుగా 19 చోట్ల ఇంకుడు గుంత లు నిర్మించాలని గుర్తించామన్నారు. వచ్చే వర్షాకాలం నాటికి ఈ పనులు పూర్తి చే యాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వాటర్ హార్వెస్టింగ్లో భా గంగా మనమంతా ఇంకుడుగుంతలను నిర్మించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్ర మంలో డీఆర్డీవో ఆర్ రవీందర్, డీపీవో ఆశాలత, తదితరులు పాల్గొన్నారు.