Share News

తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలి

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:18 AM

గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య అధికారులను ఆదేశించారు.

తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలి
మాట్లాడుతున్న జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య

జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య

చందుర్తి ఏప్రిల్‌ 18: గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య అధికారులను ఆదేశించారు. చందుర్తి మండల పరిషత్‌ కార్యాలయంలో చందుర్తి, రుద్రంగి మండలాల పంచాయతీ కార్యదర్శులతో గురువారం డీపీవో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్య పనులను పంచాయతీ సిబ్బందితో చేయించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రం గా ఉండేలా చూడాలన్నారు. 2024-25 సంవత్సరం గాని ఇంటి పన్నుల వసూలను చేపట్టాలన్నారు. ట్రేడ్‌ లైసెన్స్‌లను రెన్యూవల్‌ చేయించాలని, గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రణాళికలను తయారు చేయాలని సూచించా రు. ఇన్‌చార్జి ఎంపీడీవో, ఎంపీవో ప్రదీప్‌, సుధాకర్‌, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:18 AM