ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
ABN , Publish Date - Oct 23 , 2024 | 12:27 AM
తెలం గాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ ఉద్యమ కార్యాచరణలో భాగంగా మంగళవారం పాఠశాల స్థాయిలో మండలంలోని ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
ధర్మారం (పెద్దపల్లి రూరల్), అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి) : తెలం గాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ ఉద్యమ కార్యాచరణలో భాగంగా మంగళవారం పాఠశాల స్థాయిలో మండలంలోని ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్ర మంలో వనపర్తి అంజయ్య, వ్యాల్ల రాజేందర్ రెడ్డి, నూతి మల్లయ్య, గడ్డం దశరథ రెడ్డి,వేంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి రూరల్ (ఆంధ్రజ్యోతి) : పెండింగ్ బిల్లుల ను చెల్లిస్తూ, ఐదు డీఏలను విడుదల చేసి పీఆర్సీని ప్రక టించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని అప్పన్నపేట జిల్లా పరిషత్ పాఠశాలలో మంగళవారం ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. తపస్ ఉపా ధ్యాయ సంఘ భాధ్యులు ఎలుగం కనుకయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సట్టు పురుష్తోం, ఉపాద్యాయులు కు క్క వెంకటస్వామి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.