మిడ్జిల్లో క్లినిక్ సీజ్
ABN , Publish Date - May 27 , 2024 | 11:16 PM
స్థాయికి మించిన వైద్యం చేస్తున్నారంటు సోమవారం మండల కేంద్రంలోని వెంకటస్వామికి చెందిన క్లినిక్ను డాక్టర్ శివకాంత్ పోలీసులతో కలిసి సీజ్ చేశారు.
మిడ్జిల్, మే 27 : స్థాయికి మించిన వైద్యం చేస్తున్నారంటు సోమవారం మండల కేంద్రంలోని వెంకటస్వామికి చెందిన క్లినిక్ను డాక్టర్ శివకాంత్ పోలీసులతో కలిసి సీజ్ చేశారు. క్లినిక్లో రోగులకు అందించే ప్రథమ చికిత్స కంటే అంతకు మించి వైద్య సేవలందిస్తున్నారని కలెక్టర్ జి.రవినాయక్, డీహెంఎచ్వో డాక్టర్ కృష్ణ ఆదేశాల మేరకు క్లినిక్ను సీజ్ చేసినట్లు శివకాంత్ తెలిపారు. మండల కేంద్రంతో పాటు, ఇతర గ్రామాల్లో నిర్వహిస్తున్న క్లినిక్లకు చెందిన ఆర్ఎంపీలు కేవలం ప్రథమచికిత్సలు మాత్రమే చేసి ప్రభుత్వ ఆస్పత్రులకు పంపించాలి తప్ప అంతకు మించి వైద్య సేవలు చేయొద్దన్నారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.