ఆర్పీ శ్రీలతపై కేసు
ABN , Publish Date - Oct 22 , 2024 | 11:36 PM
ఆర్పీ శ్రీలతపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై విజయ్ తెలిపారు.
మహబూబ్నగర్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): మహిళా సంఘాల నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ఆర్పీ శ్రీలతపై కేసు నమోదైంది. పట్టణంలోని కోయనగర్ మహిళా సమాఖ్యలో రూ.1.49 కోట్లు దారి మళ్లించినట్లు తేలడంతో మం గళవారం మునిసిపల్ కమిషనర్ మహేశ్వ ర్రెడ్డి ఫిర్యాదు మేరకు ఆర్పీ శ్రీలతపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై విజయ్ తెలిపారు.