త్వరలో ఎర్రవల్లిలో సీఎం పర్యటన
ABN , Publish Date - Apr 26 , 2024 | 11:19 PM
పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎర్రవల్లి మండల కేంద్రంలో త్వరలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటించనున్నట్లు
బహిరంగ సభ ఏర్పాటుకు స్థల పరిశీలన
ఎర్రవల్లి, ఏప్రిల్ 26 : పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎర్రవల్లి మండల కేంద్రంలో త్వరలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటించనున్నట్లు యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు, ఎర్రవల్లి మాజీ సర్పంచ్ జోగుల రవి తెలిపారు. ఇందుకు గాను ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ ఆదేశం మేరకు, శుక్రవారం కాంగ్రెస్ నాయకులు ఎర్రవల్లి పరిసరాల్లో బహిరంగసభకు అనువైన ప్రదేశాలను పరీశీలించారు. త్వరలోనే బహిరంగ సభ తేదీని ప్రకటించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మీనారాయణరెడ్డి, జయచంద్రారెడ్డి, మాణిక్యరెడ్డి, సోమిరెడ్డి, శ్యామ్సుందర్, మధునాయుడు, మెడికల్ మద్దిలేటి పాల్గొన్నారు.