నష్టపరిహారం అందించేందుకు కృషి
ABN , Publish Date - May 27 , 2024 | 11:07 PM
బాధితులకు నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు తెలిపారు.
- అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు
ఉండవల్లి, మే 27 : బాధితులకు నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు తెలిపారు. మండల కేంద్రానికి గొల్ల శ్రీరాములు, రాములులకు చెందిన గడ్డివాములు మూడు రోజుల క్రితం కాలిపోయాయి. విషయం తెలుసుకున్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సోమవారం సాయంత్రం గ్రామానికి వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించి, బాధితులతో మాట్లాడారు. గడ్డివాములు దగ్ధం కావడంతో లక్షన్నర రూపాయలు నష్టం వాటిల్లినట్లు వారు తెలిపారు. విష యాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం అందేలా చూస్తా నని హమీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట నాయకులు చల్లా దామోదర్రెడ్డి, కొండన్న, రాముడు, స్వాములు, రాంభూపాల్రెడ్డి, రజాక్ ఉన్నారు.