Share News

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:34 PM

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరి ష్కరించేందుకు ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటానని ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి దార సుందర్‌ తె లిపారు.

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి

మహబూబ్‌నగర్‌ టౌన్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరి ష్కరించేందుకు ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటానని ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి దార సుందర్‌ తె లిపారు. ఉద్యోగులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి సమస్యలను ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. మంగళవా రం స్థానిక బోయపల్లి రోడ్డులో గల సత్యసాయి బాబా ఫంక్షన్‌ హాల్‌లో టీ ఎస్‌ ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా జనరల్‌ బాడీ సమావేశం జరిగింది. ఈసమావేశానికి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గడ్డం శ్రీనివాస్‌, కృష్ణ, రాష్ట్ర చైర్మన్‌ రాజయ్య నాయక్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జిల్లా ఉద్యోగుల సమస్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర అధ్యక్ష కార్య దర్శులు ఆధ్వర్యంలో జిల్లా నూతన కమి టీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా అచ్చంపే ట డిపోకి చెందిన వెంకటయ్య ప్రధాన కార్యద ర్శిగా కల్వకుర్తి డిపోకు చెందిన కండక్టర్‌ దార సుందర్‌ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా మహబూబ్‌నగర్‌ పురపాలక కౌన్సిలర్‌ జాజిమొగ్గ నరసింహులును ఎన్నుకు న్నారు. వీరికి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు నియా మక పత్రాలు అందజేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో రాష్ట్ర, జోనల్‌, రీజినల్‌, డిపోల అధ్యక్ష కార్యద ర్శులు, నాయకులుపాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 11:34 PM