పేదలకు అండగా.. ఉపాధి హామీ పథకం
ABN , Publish Date - Feb 02 , 2024 | 10:57 PM
కోవిడ్ కష్ట కాలంలో గ్రామాల్లోని పేదలకు మహాత్మాగాంధీ జాతీ య గ్రామీణ ఉపాధి హామీ పథకం అండగా నిలిచిం దని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు.
- కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
వనపర్తి రాజీవ్చౌరస్తా, ఫిబ్రవరి 2: కోవిడ్ కష్ట కాలంలో గ్రామాల్లోని పేదలకు మహాత్మాగాంధీ జాతీ య గ్రామీణ ఉపాధి హామీ పథకం అండగా నిలిచిం దని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. ఫిబ్రవరి 2వ తేదీ ఉపాధి హామీ పథకం ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్లో వేడు కలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ... గ్రామాల అభివృద్ధిలో ఉపాధి హామీ పథకం కీలకపాత్ర పోసిస్తుందని పేర్కొన్నారు. డీఆర్డీవో సిబ్బంది ఉపాధి హామీ పథకం 19వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ మాట్లాడుతూ... భవిష్యత్తులో కూడా ఈ స్కీమ్ను ఇలాగే ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. అనంతరం కలెక్టర్ కేక్ కట్ చేసి ఉద్యో గులకు అందించారు. కార్యక్రమంలో డీఆర్డీవో నరసింహులు, డీఆర్డీఏ సిబ్బంది పాల్గొన్నారు.
ఖిల్లాఘనఫురంలో..
ఖిల్లాఘణపురం: ఉపాధిహామీ పథకం నిరుపేదల జీవనోపాధికి వరం లాంటిదని ఎంపీడీవో విజయ్ కుమార్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం ఉపాధి హామీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాధి సిబ్బంది, కూలీలు అధికారులు గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. రుక్కన్నపల్లి నర్సరీలో కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం నిరుపేద కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిం దని అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు సామ్య నాయక్, ఎంపీవో రాజు, ఎంఈవో ఉషారాణి, ఏపీవో సత్యనారాయణ, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరులో..
ఆత్మకూరు : జాతీయ ఉపాధి హామీ పథకం 19వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఎంపీడీవో ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండలంలోని గుంటిపల్లిలో జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలతో కేక్కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమంలో ఎంఈవో భాస్కర్ సింగ్, ఎంపీవో నరసింహ రావు, టెక్నికల్ అసిస్టెంట్ సమ్మద్, పంచాయతీ కార్యదర్శి సుచిత్ర, ఉపాధి కూలీలు గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.
పాన్గల్లో..
పాన్గల్ : మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఉపాధిహామి పథకం ఆవిర్బావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఎంపీడీవో రఘురాం కేక్ కట్ చేసి ఉపాధి సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఏపీవో కురుమయ్య, టెక్నికల్ అసిస్టెంట్లు,ఫిల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.