Share News

ఆయన మాకొద్దు..

ABN , Publish Date - Oct 23 , 2024 | 11:14 PM

గొరిట సింగిల్‌ విండో చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనప్పటికీ సభ్యులు ఆయ న మాకొద్దు అంటూ చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టాలని బుధ వారం నాగర్‌కర్నూల్‌లో డీసీవోకు ఫిర్యాదు చేశారు.

ఆయన మాకొద్దు..
జిల్లా కో ఆపరేటివ్‌ అధికారికి ఫిర్యాదు చేస్తున్న సభ్యులు

-విండో చైర్మన్‌పై సభ్యుల అవిశ్వాస తీర్మానానికి ఫిర్యాదు

తిమ్మాజిపేట, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : గొరిట సింగిల్‌ విండో చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనప్పటికీ సభ్యులు ఆయ న మాకొద్దు అంటూ చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టాలని బుధ వారం నాగర్‌కర్నూల్‌లో డీసీవోకు ఫిర్యాదు చేశారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా తిమ్మాజిపేట మండలంలోని గొరిట సింగిల్‌ విండోలో 13మంది సభ్యులు ఉన్నారు. ఇందులో ఏడుగురు డైరెక్టర్లు అవిశ్వాసం పెట్టాలని ఫిర్యాదు చేశారు. సింగిల్‌ విండోలో రూ. రెండు కోట్ల మేర అవినీతి చోటు చేసుకోవడం, దీనికి ప్రధాన కారణం సీఈవో అని తెలిసినప్పటికీ చైర్మన్‌ పట్టించు కోకపో వడం వల్లే సింగిల్‌విండో అబాసుపాలైందని సభ్యులు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా అవిశ్వాసంపై మండలం లో సర్వత్రా చర్చ జరుగుతోంది.

Updated Date - Oct 23 , 2024 | 11:14 PM