జూరాలకు 400 క్యూసెక్కుల ఇన్ఫ్లో
ABN , Publish Date - May 22 , 2024 | 11:19 PM
జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరి నీటి ఇన్ఫ్లో భారీగా తగ్గుముఖం పట్టింది.
అమరచింత, మే 22: జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరి నీటి ఇన్ఫ్లో భారీగా తగ్గుముఖం పట్టింది. బుధవారం జూరాల ప్రాజెక్టుకు 400 క్యూసెక్కుల ఇన్ఫ్లో మాత్రమే ప్రాజెక్టుకు చేరింది. దీంతో మన రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి నారాయణపూర్ డ్యామ్ నుంచి 1.9 టీఎంసీల నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. జూరాల ప్రాజెక్టులలో ప్రస్తుతం 3.732 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ కన్నా కేవలం 400 క్యూసెక్కుల నీరు మాత్రమే అదనంగా జూరాల ప్రాజెక్టుకు చేరింది. నారాయణపూర్ డ్యామ్ నుంచి దిగువకు గత పది రోజులుగా భారీగా వచ్చిన వరద నీరు తగ్గుముఖం పట్టింది. ఏదేమైనా ఈ ప్రాంతంలో ఏర్పడిన తాగునీటి ఇబ్బందుల జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి ఇప్పటికే సత్యసాయి పంప్ హైస్ల ద్వారా సరఫరా కొనసాగుతుంది. తాగునీటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే సమాంతర కాలువ ద్వారా 260 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. జూరాల ప్రాజెక్టుకు ఎగువన ఉన్న నారాయణపూర్ డ్యామ్ నుంచి వరద భారీగా తగ్గిందని ప్రాజెక్టు అధికారులు బీచుపల్లి ఆంజనేయులు తెలిపారు.