జాతీయ రహదారిపై లిక్కర్ వాహనం బోల్తా
ABN , Publish Date - Oct 23 , 2024 | 11:18 PM
జాతీయ రహదారి జడ్చర్ల కొత్తబస్టాండు దగ్గరలోని ఓ హోటల్ సమీపంలో మద్యం తరలిస్తున్న వాహనం బోల్తా ప డింది.
జడ్చర్ల, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : జాతీయ రహదారి జడ్చర్ల కొత్తబస్టాండు దగ్గరలోని ఓ హోటల్ సమీపంలో మద్యం తరలిస్తున్న వాహనం బోల్తా ప డింది. ఓ కంపెనీకి చెందిన మద్యం సీసా లను పెబ్బేర్ నుంచి కొత్తూరుకు తరలి స్తుండగా జడ్చర్ల కొత్తబస్టాండు సమీపం లో ముందువెళ్తున్న వాహనాన్ని ఢీ కొట్ట డంతో బోల్తా పడింది. దీంతో వాహనం లో ఉన్న మద్యం సీసాలను ఆ వైపు వెళ్తున్న వారంతా ఎత్తుకెళ్లారు. వరుసగా నాలుగు వాహనాలు ఢీ కొన్న ఈ ఘట నలో ఐరన్ లోడ్తో ఉన్న లారీడ్రైవర్ తాజొద్దీన్, కంటైనర్ డ్రైవర్ యూసుఫ్కు గాయాలయ్యాయి. వీరిని 108 అంబులెన్స్ లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘట నా స్థలానికి జడ్చర్ల పోలీసుల చేరుకుని మద్యం తీసుకెళ్లకుండా చూస్తున్నారు.