ఆదర్శప్రాయుడు
ABN , Publish Date - May 21 , 2024 | 10:53 PM
దివంగత ఇందిరాగాంధీ బాటలో నడిచి, కాంగ్రెస్ వాదులకు ఆదర్శంగా నిలిచిన నాయకుడు రాజీవ్గాంధీ అని జడ్పీ చైర్పర్సన్ సరిత కొనియాడారు.
- ఘనంగా నివాళి అర్పించిన జడ్పీ చైర్పర్సన్ సరిత
గద్వాల, మే 21 : దివంగత ఇందిరాగాంధీ బాటలో నడిచి, కాంగ్రెస్ వాదులకు ఆదర్శంగా నిలిచిన నాయకుడు రాజీవ్గాంధీ అని జడ్పీ చైర్పర్సన్ సరిత కొనియాడారు. రాజీవ్గాంధీ వర్ధంతి సందర్భంగా మంగళవారం జడ్పీ క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలను వదిలిన నాయకుడన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి రాజీవ్ గాంధీ అన్నారు. ఆయన కుటుంబం మొత్తం దేశ సేవలో ఉందని గుర్తు చేశారు. ఆలాంటి కుటుంబానికి అండగా ఉందామని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, పట్టణ అధ్యక్షుడు ఇసాక్, నాయకులు మధుసూదన్బాబు, లత్తిపురం వెంకట్రామిరెడ్డి, శెట్టి ఆత్మకూర్ లక్ష్మణ్, అమరవాయి కృష్ణారెడ్డి, శ్రీనివాసులుగౌడ్, ఆనంద్గౌడ్, రాజశేఖర్రెడ్డి, మహేష్, నాగశంకర్, స్వామినాయుడు, డీఆర్ శ్రీధర్, కుర్వ శ్రీనివాసులు, కరాటే సత్యం పాల్గొన్నారు.