తాగునీటి బోర్లకు మరమ్మతులు
ABN , Publish Date - Apr 12 , 2024 | 10:55 PM
అమరచింత పట్టణంలోని వివిధ కాలనీలలో శుక్రవారం తాగునీటి బోర్లకు మునిసిపల్ సిబ్బంది మరమ్మతులు చేపట్టారు.
అమరచింత, ఏప్రిల్ 12: అమరచింత పట్టణంలోని వివిధ కాలనీలలో శుక్రవారం తాగునీటి బోర్లకు మునిసిపల్ సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. ఇటీవల నాలుగో వార్డు, ఐదో వార్డు పరిధిలోని ఎస్సీ కాలనీలో తాగునీటి బోర్లు, మరమ్మతుకు రావడంతో తాగునీటి సమస్య ఏర్పడింది. ఈ విషయాన్ని ్తస్థానిక కౌన్సిలర్లు మునిసిపల్ చైర్ పర్సన్ మంగమ్మ, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన వారు మరమ్మతు చేయించారు.