ఇంటర్ పరీక్షలు మొదటి రోజు ప్రశాంతం
ABN , Publish Date - Feb 28 , 2024 | 11:12 PM
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా ముగిశాయి. బుధవారం ఇంటర్ ప్రథమ సంవత్సరం సెకండ్ లాగ్వేజ్ పేపర్-1 పరీక్ష నిర్వహించగా జిల్లా వ్యాప్తంగా మొత్తం 6,854 మంది విద్యార్థులు హాజ రు కాగా 434 మంది గైర్హాజరయ్యారు.
- హాజరైన 6,854 మంది విద్యార్థులు
నాగర్కర్నూల్ టౌన్, ఫిబ్రవరి 28: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా ముగిశాయి. బుధవారం ఇంటర్ ప్రథమ సంవత్సరం సెకండ్ లాగ్వేజ్ పేపర్-1 పరీక్ష నిర్వహించగా జిల్లా వ్యాప్తంగా మొత్తం 6,854 మంది విద్యార్థులు హాజ రు కాగా 434 మంది గైర్హాజరయ్యారు. అందులో జనరల్ విద్యార్థులు 5,436 మంది హాజరు కాగా 312 మంది గైర్హజరయ్యారు. అదేవిధంగా ఓకేషనల్లో 1,418 మంది హాజరు కాగా 125 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారు. జిల్లా వ్యాప్తంగా 32 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా జిల్లా ఇంటర్ విద్యా నోడల్ అధికారి వెంకటరమణ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల కళాశాలతో పాటు గీతాంజలి, శ్రీనివాస పద్మావతి కళాశాలలను సందర్శించి తనిఖీ చేశారు. మొదటి రోజు ఎలాంటి మాస్ కాపీయింగ్ కేసులు నమోదు కాలేదని ఆయన తెలిపారు.