జాబ్ మేళా విజయవంతం
ABN , Publish Date - Apr 26 , 2024 | 11:21 PM
తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జి సెంటర్ ఆధ్వర్యంలో స్థానిక ఎంఏఎల్డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన బాబ్ మేళా విజయవంతమైంది.
- ఎంపికైన 50 మందికి ధ్రువపత్రాలు
గద్వాల టౌన్, ఏప్రిల్ 26 : తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జి సెంటర్ ఆధ్వర్యంలో స్థానిక ఎంఏఎల్డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన బాబ్ మేళా విజయవంతమైంది. హైదరాబాద్కు చెందిన ఎంఎస్ఎల్ లాబొరేటరీస్ ప్రైవేటు లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మేళాకు హాజరైన అభ్యర్థులను కంపెనీ హెచ్ఆర్లు జోషి ఆంటోని, దినేష్లు ఇంటర్వ్యూ చేశారు. ఎంపిక చేయాల్సిన ఉద్యోగానికి సంబంధించి అభ్యర్థుల నుంచి అవగాహన సామర్థ్యాన్ని పరిశీలించేందుకు రాత పరీక్ష నిర్వహిం చారు. జాబ్మేళాకు 250 మంది విద్యార్థులు హాజరుకాగా, ప్రతిభ, అవగాహన సామర్థ్యం ఆధారంగా 50 మందిని ఎంపిక చేసి ధ్రువపత్రాలను అందించారు. వారిని ప్రిన్సిపాల్ డాక్టర్ షేక్ కలందర్ బాషా అభినందించారు. వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుంటే మెరుగైన అవకాశాలు పొందొచ్చని సూచించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ డి.శ్రీపతినాయుడు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ లవీన మంజులత, కళాశాల టీఎస్కేసీ సమన్వయకర్త మనోజ్కుమార్, మెంటార్ సుబ్రమణ్యం, అధ్యాపకులు కృష్ణమూర్తి, హరిబాబు, డాక్టర్ కరుణాకర్, కళాశాల ఏవో మగ్బుల్ అహ్మద్ ఉన్నారు.