Share News

సంస్కారం లేకుండా మాట్లాడితే ఊరుకోం

ABN , Publish Date - Oct 01 , 2024 | 11:14 PM

తూప్రాన్‌, అక్టోబరు 1: మహిళా చైర్‌పర్సన్‌ అయిన తనపై సంస్కారం లేకుండా మరోసారి మాట్లాడితే ఊరుకోమని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మామిండ్ల జ్యోతికృష్ణ హెచ్చరించారు.

సంస్కారం లేకుండా మాట్లాడితే ఊరుకోం

మాజీ మున్సిపల్‌ చైర్మన్‌పై చైర్‌పర్సన్‌ ఘాటు వ్యాఖ్యలు

తూప్రాన్‌, అక్టోబరు 1: మహిళా చైర్‌పర్సన్‌ అయిన తనపై సంస్కారం లేకుండా మరోసారి మాట్లాడితే ఊరుకోమని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మామిండ్ల జ్యోతికృష్ణ హెచ్చరించారు. సోమవారం మున్సిపల్‌ కార్యాలయంలో మాజీ చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌ ఆరోపణలపై మంగళవారం మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నందాల శ్రీనివాస్‌, కౌన్సిలర్లు, కాంగ్రెస్‌ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మహిళా చైర్‌పర్సన్‌ అయిన తనపై సంస్కారం లేకుండా మాట్లాడారన్నారు. సమావేశానికి హాజరయ్యేందుకు వస్తుంటే అర్ధాంతరంగా ముగించి వెళ్లిపోయారంటూ చేసిన ఆరోపణలు ఖండించారు. 11 గంటలకు సమావేశమంటూ ఎజెండా పంపిస్తే ప్రజలపై ప్రేమ ఉంటే ఎందుకు రాలేదన్నారు. సమస్యలపై చర్చించేందుకు వస్తుంటే తామేమన్న అడ్డుకున్నామా? హాజరయ్యేందుకు 11 గంటలకే ఎందుకు రాలేదని ప్రశ్నించారు. అంశాలు చర్చించిన తర్వాతే సమావేశం ముగించామన్నారు. మహిళా సభ్యులను సమావేశానికి రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఆయన హయాంలో కనీసం ఎజెండాలోని అంశాలు చర్చింకుడానే సమావేశం నిర్వహించారన్నారు.

Updated Date - Oct 01 , 2024 | 11:14 PM