Share News

రైతులకు రుణమాఫీ పునరుద్ధరణ

ABN , Publish Date - Jul 25 , 2024 | 11:05 PM

సంగారెడ్డి రూరల్‌, జూలై 25: పంట రుణాలు మాఫీ పొందిన రైతులకు వెంటనే రుణాలు రెన్యూవల్‌ చేయాలని సంగారెడ్డి కలెక్టర్‌ వల్లూరు క్రాంతి బ్యాంకు అధికారులను ఆదేశించారు.

రైతులకు రుణమాఫీ పునరుద్ధరణ
సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న సంగారెడ్డి కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

సంగారెడ్డి కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

సంగారెడ్డి రూరల్‌, జూలై 25: పంట రుణాలు మాఫీ పొందిన రైతులకు వెంటనే రుణాలు రెన్యూవల్‌ చేయాలని సంగారెడ్డి కలెక్టర్‌ వల్లూరు క్రాంతి బ్యాంకు అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో గురువారం బ్యాంకర్లతో నిర్వహించిన సమీక్షా సమాశంలో ఆమె మాట్లాడారు. పంట రుణాలు పొందిన డబ్బులను వ్యవసాయ పనుల నిమిత్తం వాడుకునేలా రైతులకు చెల్లించాలన్నారు. బ్యాంకు అధికారులు రుణమాఫీ డబ్బులు ఇతర రుణాల కింద జమచేయకుండా సకాలంలో చెల్లించి రైతులకు ఉపయోగపడేలా చూడాలని సూచించారు. పంట రుణాల రెన్యూవల్‌ రెండు, మూడురోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారి నర్సింహారావు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Jul 25 , 2024 | 11:06 PM