అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
ABN , Publish Date - Jan 05 , 2024 | 11:29 PM
దరఖాస్తులు పరిశీలించిన తర్వాతే లబ్ధిదారుల ఎంపిక సంగారెడ్డి అదనపు కలెక్టర్ మాధురి
పుల్కల్, జనవరి 5: అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని, దరఖాస్తులు పరిశీలించాకే లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ మాధురి అన్నారు. మండల కేంద్రమైన చౌటకూర్లో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో జడ్పీ సీఈవో సీహెచ్.ఎల్లయ్యతో కలిసి ఆమె దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు నిరాటకంగా కొనసాగుతాయని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఈశ్వరీరాణి, ఎంపీడీవో ఎస్పీ జయలక్ష్మి, ఏవో చైతన్య, సర్పంచ్ కొల్కూరి వీరమణిమొగులయ్య, సీడీసీ మాజీ చైర్మన్ బీ.సుభా్షరెడ్డి, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు వర్కల రమేశ్, మాజీ ఉప సర్పంచ్ కలాలి రామాగౌడ్, నాయకులు సార గోవర్ధన్ముదిరాజ్, నరేందర్గౌడ్, నరేందర్రెడ్డి, ఎండీ ఖైసర్, అబేద్హుస్సేన్, పార్కల రాంరెడ్డి పాల్గొన్నారు.