ప్రజల్లో ఆత్మస్థైర్యం పెంచడానికే ఫ్లాగ్మార్చ్: ఏసీపీ
ABN , Publish Date - Apr 19 , 2024 | 12:13 AM
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా గుట్టలో గురువారం పోలీసులు కేంద్ర బలగాలతో స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి గాంధీనగర్ వరకు ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు.
యాదగిరిగుట్ట రూరల్, ఏప్రిల్ 18: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా గుట్టలో గురువారం పోలీసులు కేంద్ర బలగాలతో స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి గాంధీనగర్ వరకు ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ రమే్షకుమార్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు ప్రజల్లో ఆత్మస్థైర్యం పెంచడానికి, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి ప్రజలు ఎలాంటి భయబ్రాంతులకు గురికావద్దని, తమ ఓటును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరారు. సీఐ రమేష్, ఎస్ఐలు ఉదయ్కిరణ్, చంద్రశేఖర్ ఉన్నారు.