Share News

ప్రజల్లో ఆత్మస్థైర్యం పెంచడానికే ఫ్లాగ్‌మార్చ్‌: ఏసీపీ

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:13 AM

పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా గుట్టలో గురువారం పోలీసులు కేంద్ర బలగాలతో స్థానిక పోలీస్‌ స్టేషన్‌ నుంచి గాంధీనగర్‌ వరకు ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించారు.

ప్రజల్లో ఆత్మస్థైర్యం పెంచడానికే ఫ్లాగ్‌మార్చ్‌: ఏసీపీ

యాదగిరిగుట్ట రూరల్‌, ఏప్రిల్‌ 18: పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా గుట్టలో గురువారం పోలీసులు కేంద్ర బలగాలతో స్థానిక పోలీస్‌ స్టేషన్‌ నుంచి గాంధీనగర్‌ వరకు ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ రమే్‌షకుమార్‌ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్‌ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు ప్రజల్లో ఆత్మస్థైర్యం పెంచడానికి, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి ప్రజలు ఎలాంటి భయబ్రాంతులకు గురికావద్దని, తమ ఓటును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరారు. సీఐ రమేష్‌, ఎస్‌ఐలు ఉదయ్‌కిరణ్‌, చంద్రశేఖర్‌ ఉన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 07:47 AM