Share News

బుద్ధవనానికి ప్రాధాన్యం ఇవ్వడం గర్వకారణం

ABN , Publish Date - Oct 23 , 2024 | 01:02 AM

బుద్ధవనానికి ప్రాధాన్యమిస్తూ రామప్ప ఆలయం, గోల్కోండ కోటలతో ఏర్పాటుచేసిన స్టాల్‌ను కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత ప్రారంభించడం గర్వకారణమని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన పటేల్‌ రమే్‌షరెడ్డి అన్నారు.

 బుద్ధవనానికి ప్రాధాన్యం ఇవ్వడం గర్వకారణం
బుద్ధవనం స్టాల్‌ను ప్రారంభిస్తున్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత, పక్కన పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన పటేల్‌ రమేష్‌రెడ్డి

నాగార్జునసాగర్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): బుద్ధవనానికి ప్రాధాన్యమిస్తూ రామప్ప ఆలయం, గోల్కోండ కోటలతో ఏర్పాటుచేసిన స్టాల్‌ను కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత ప్రారంభించడం గర్వకారణమని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన పటేల్‌ రమే్‌షరెడ్డి అన్నారు. బీహార్‌ రాష్ట్ర రాజధాని పాట్నాలో మంగళవారం జరిగిన ట్రావెల్‌ ట్రేడ్‌ ఫెయిర్‌లో రాష్ట్రం తరుపున ఏర్పాటు చేసిన బుద్ధవనం స్టాల్‌ను మంత్రి ప్రారంభించినట్లు రమేష్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని బుద్ధవనం సందర్శనకు ఆహ్వానించగా సానుకూలంగా స్పందించినట్లు ఆయన పేర్కొన్నారు. బుద్ధవనం విశేషాలను కేంద్ర మంత్రికి కన్సల్‌టెంట్‌ ఈమని శివనాగిరెడ్డి వివరించారు.

Updated Date - Oct 23 , 2024 | 01:02 AM