Share News

సైనికులు దేశ భక్తికి ప్రతీక

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:50 AM

సైనికులు దేశభక్తికి నిలువెత్తు ప్రతీకలని ఆర్మీ కళాశాల డైరెక్టర్‌ కెప్టెన్‌ రాఖీ చౌహాన్‌ అన్నారు. శుక్రవారం బీబీనగర్‌ పట్టణ శివారులోని సాంఘిక సంక్షేమ ఆర్మీ మహిళా డిగ్రీ కళాశాలలో సెంట్రల్‌ బ్యూ రో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్గిల్‌ విజయ్‌ దివస్‌ రజతోత్సవం లో ఆమె పాల్గొన్నారు.

సైనికులు దేశ భక్తికి ప్రతీక

ఆర్మీ కళాశాల డైరెక్టర్‌ కెప్టెన్‌ రాఖీ చౌహాన్‌

బీబీనగర్‌, జూలై 26: సైనికులు దేశభక్తికి నిలువెత్తు ప్రతీకలని ఆర్మీ కళాశాల డైరెక్టర్‌ కెప్టెన్‌ రాఖీ చౌహాన్‌ అన్నారు. శుక్రవారం బీబీనగర్‌ పట్టణ శివారులోని సాంఘిక సంక్షేమ ఆర్మీ మహిళా డిగ్రీ కళాశాలలో సెంట్రల్‌ బ్యూ రో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్గిల్‌ విజయ్‌ దివస్‌ రజతోత్సవం లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాఖీ చౌహాన్‌ మాట్లాడుతూ కార్గిల్‌ యుద్ధంలో వందలాది మంది భారత సైనికులు దేశ రక్షణకోసం తమ ప్రాణాలను త్రుణప్రాయంగా అర్పించారని కొనియాడారు. కార్గిల్‌ యుద్ధంలో పాల్గొన్న సైనికులను కళాశాల అధ్యాపక బృందం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా క్షేత్ర ప్రచార అధికారి కోటేశ్వర్‌రావు, ఆర్మీ కళాశాల ప్రిన్సిపల్‌ పాండు రంగ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 12:50 AM