Share News

Kaleshwaram: ప్రాజెక్టు వివరాలడిగితే నీళ్లు నమిలిన అధికారులు.. సీరియస్ అయిన నిపుణుల కమిటీ

ABN , Publish Date - Mar 09 , 2024 | 08:39 PM

కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల వివరాలు అడిగిన నిపుణుల కమిటీ సభ్యులకు విచిత్ర అనుభవం ఎదురైంది. ఎన్డీఎస్ఏ చీఫ్ చంద్రశేఖర్ అయ్యర్ ఆఫీసర్లపై సీరియస్ అయ్యారు.

Kaleshwaram: ప్రాజెక్టు వివరాలడిగితే నీళ్లు నమిలిన అధికారులు.. సీరియస్ అయిన నిపుణుల కమిటీ

కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల వివరాలు అడిగిన నిపుణుల కమిటీ సభ్యులకు విచిత్ర అనుభవం ఎదురైంది. ఎన్డీఎస్ఏ చీఫ్ చంద్రశేఖర్ అయ్యర్ ఆఫీసర్లపై సీరియస్ అయ్యారు. డిజైన్ అండ్ ఎగ్జిక్యూటివ్ అధికారులను కమిటీ సభ్యులు ప్రశ్నలు అడిగి ఉక్కిరిబిక్కిరి చేశారు. ప్రాజెక్టు వివరాలపై కొంతమంది అధికారుల్లో స్పష్టత లేకపోవడంతో అయ్యర్ అసహనం వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో మూడుసార్లు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఇచ్చిన సమాచారంపై అయ్యర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టు సమాచారం అడిగినప్పుడు ఇంజినీర్లు ఒకరిపై ఒకరు సాకులు చెప్పుకున్నారు. కమిటీ ప్రశ్నలకు సమాధానాలు లేకపోవడంతో సభ్యులు అసహనానికి గురై సమావేశాన్ని ముగించారు.

Updated Date - Mar 09 , 2024 | 08:40 PM