Share News

TS News: కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలో ఎలుకల ఘటనపై అధికారుల చర్యలు

ABN , Publish Date - Feb 12 , 2024 | 11:05 AM

కామారెడ్డి జిల్లా: ఏరియా ఆసుపత్రిలో ఎలుకల ఘటనపై అధికారుల చర్యలు చేపట్టారు. పేషెంట్‌ను ఎలుకలు కొరికిన ఘటనలో ఇద్దరు వైద్యులు, నర్సుపై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్‌ పరిశీలనకు రాగ జిల్లా కలెక్టర్‌ను ప్రభుత్వం వివరణ కోరింది.

TS News: కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలో ఎలుకల ఘటనపై అధికారుల చర్యలు

కామారెడ్డి జిల్లా: ఏరియా ఆసుపత్రిలో ఎలుకల ఘటనపై అధికారుల చర్యలు చేపట్టారు. పేషెంట్‌ను ఎలుకలు కొరికిన ఘటనలో ఇద్దరు వైద్యులు, నర్సుపై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్‌ పరిశీలనకు రాగ జిల్లా కలెక్టర్‌ను ప్రభుత్వం వివరణ కోరింది. దీంతో ఆస్పత్రిలోని ఐసియు ఇంచార్జ్ డాక్టర్ కావ్య, ఇంచార్జ్ జనరల్ మెడిసిన్ డాక్టర్ వసంత, స్టాఫ్ నర్స్ మంజులను సస్పెండ్ చేస్తూ డిఎంఈ అధికారి ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మిని విచారణ పూర్తయ్యే వరకు సరెండర్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Updated Date - Feb 12 , 2024 | 11:05 AM