Home » Kamareddy
అద్దె బకాయిలు చెల్లించని నేపథ్యంలో ఆర్మూర్లోని జీవన్రెడ్డి మాల్ను ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం మాల్ వద్దకు చేరుకున్న అధికారులు భవనానికి నోటీసులు అతికించి.. తాళం వేశారు. ఒప్పందం ప్రకారం విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ బాధ్యులు అద్దె చెల్లించనందు వల్ల హైకోర్టు ఆదేశాల మేరకు జీవన్రెడ్డి మాల్ను స్వాధీనం చేసుకుంటున్నట్టు మైక్లో ప్రకటించారు. మాల్లో ఉన్న షాపుల యజమానులు సహకరించాలని కోరారు.
మహిళ మెడికల్ ఆఫీసర్లను కామారెడ్డి జిల్లా డీఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్ లైంగిక వేధింపులకు గురి చేసిన విషయమై దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళా మెడికల్ ఆఫీసర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద 7 కేసులు నమోదు చేసినట్లు కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కామారెడ్డి డీఎంహెచ్వో లక్ష్మణ్ సింగ్, సూపరింటెండెంట్ శ్రీనునాయక్ను బుధవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మణ్ సింగ్, శ్రీనునాయక్పై తాజాగా మరికొందరు పీహెచ్సీల మహిళా మెడికల్ ఆఫీసర్లు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు అధికారులపై 354, 354 డీ, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు.
రంగారెడ్డి జిల్లా: ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాండూర్, కామారెడ్డిలలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు పఠాన్చెరు కార్నర్ మీటింగ్లో పాల్గొననున్నారు.
కామారెడ్డి జిల్లా: తాడ్వాయి మండలం, దేవాయిపల్లి గ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రమాణిస్తున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్(45) మృతి చెందారు.
తెలంగాణలో బీఆర్ఎస్కు వరుస షాక్లు తగులుతున్నాయి. ఓ వైపు సీనియర్లు పార్టీని వీడుతుంటే.. మరోవైపు స్థానిక సంస్థల్లో ఆ పార్టీ మరింత బలహీనపడుతుంది. తాజాగా కామారెడ్డి బీఆర్ఎస్ మున్సిపల్ ఛైర్పర్సన్ నిట్టు జాహ్నవిపై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. దీంతో ఆమె ఛైర్ పర్సన్ పదవి కోల్పోయారు. కామారెడ్డి కొత్త మున్సిపల్ ఛైర్ పర్సన్గా కాంగ్రెస్ కౌన్సిలర్ గడ్డం ఇందుప్రియ ఎన్నికయ్యారు.
కామారెడ్డి జిల్లా: రామారెడ్డి మండలం, అక్కాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మండల కేంద్రంలో సహజీవనం చేస్తున్న నరేష్, స్రవంతిలపై మొదటి భార్య, బంధువులు దాడి చేశారు. సభ్య సమాజం సిగ్గుపడేలా నరేష్, స్రవంతిలను వివస్త్రాలు చేసి కారం చల్లుతూ దాడి చేశారు.
Katepally Ramana Reddy: తెలంగాణలో రాజకీయ పరిణామాలు (TS Politics) రోజురోజుకూ మారిపోతున్నాయ్.! వరుసగా రెండుసార్లు అధికారం దక్కించుకున్న బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా తయారయ్యిందో ప్రత్యక్షంగా మనం చూస్తూనే ఉన్నాం. అతిపెద్ద పార్టీగా ఉన్న బీఆర్ఎస్.. ఇప్పుడు అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి.! ఎంపీలు అందరూ కమలం పార్టీలో చేరుతుండగా.. ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరిపోతున్నారు..
కామారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ (BRS) కార్యకర్తల సమావేశంలో వర్గ విభేదాలు మరోసారి బయట పడ్డాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఎదురుగానే కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. సీనియర్ నాయకుడు కొమ్ముల తిర్మల్ రెడ్డి ప్రసంగంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్దన్ పేరు ప్రస్తావించకపోవడంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana: కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలో అదనపు గదుల ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. ప్రారంభోత్సవానికి విశిష్ట అతిథిగా మహమ్మద్ అలీ షబ్బీర్ అని ఆహ్వానించడం పట్ల కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రభుత్వ ఆసుపత్రి అధికారులపై బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.