Share News

Peddapalli : మళ్లీ కూలిన ఓడేడు వంతెన గర్డర్లు

ABN , Publish Date - Jul 03 , 2024 | 02:33 AM

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు, జయశంకర్‌ భూపలిపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామాల మధ్యలో మానేరుపై నిర్మాణంలో ఉన్న వంతెన గర్డర్లు మంగళవారం రాత్రి కుప్పకూలాయి.

Peddapalli : మళ్లీ కూలిన ఓడేడు వంతెన గర్డర్లు

ముత్తారం, జూలై 2: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు, జయశంకర్‌ భూపలిపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామాల మధ్యలో మానేరుపై నిర్మాణంలో ఉన్న వంతెన గర్డర్లు మంగళవారం రాత్రి కుప్పకూలాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు 17-18 పిల్లర్ల మధ్యలో ఉన్న రెండు గర్డర్లు ఒకవైపు వంగి నేలమట్టమయ్యాయి. గర్డర్లు కూలిన సమయంలో కింద ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 22న రాత్రి ఇదే విధంగా 10-11 పిల్లర్ల మధ్యలో ఉన్న గర్డర్లు ఈదురుగాలులకు నేలమట్టమయ్యాయి. వంతెన లేకపోవడంతో రాకపోకల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డుపై వెళ్లేవారు గర్డర్లు కూలడంపై భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వంతెన నిర్మాణాన్ని పటిష్ఠంగా, త్వరగా పూర్తిచేయాలని కోరుతున్నారు.

Updated Date - Jul 03 , 2024 | 02:33 AM