Home » Peddapalli
భూ సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి ఆర్వోఆర్ చట్టంపై విస్తృతంగా ప్రచారం కల్పించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో భూ భారతి చట్టం అమలుపై అదనపు కలెక్టర్ డి వేణు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితిలో ఉందని, ఆ పార్టీలో మంత్రి పదవుల కోసం కొట్లాడుకుంటున్నారని కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ నిజామాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. తెలంగాణాలో రాబోయేదీ బీజేపీ ప్రభుత్వమే నని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య అన్నా రు.
కార్మిక వ్యతిరేకంగా ఉన్న 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో మంగళవారం అన్ని కార్మిక సంఘాల జిల్లా సదస్సు నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యం రావు, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కడారి సునీల్, ఐఎన్టీయుసీ బూమల్ల చందర్, ఐఎఫ్టీయు నాయకులు కె. విశ్వ నాథ్, సిహెచ్ శంకర్, వైకుంఠం మాట్లాడారు.
జిల్లాలో మాదకద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డి.వేణు అధికా రులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో మాదక ద్రవ్యాల, నియంత్రణ చర్యలపై అధికారులతో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని నిర్వహించారు.
అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తితో రాష్ట్ర ప్రజల సంక్షేమమే ఏజెండాగా ప్రజా ప్రభుత్వ పాలన కొనసాగిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్బాబు స్పష్టం చేశారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రధాన చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రామగుం డం ఎన్టీపీసీలో సోమవారం జాతీయ అగ్నిమాపక(ఫైర్ సర్వీస్) వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. జాతీ య ఫైర్ సర్వీస్ డే సంద ర్భంగా వారం రోజులపాటు నిర్వహించే కార్యక్రమాలను ఎన్టీపీసీ జీఎం ఎ.కె.త్రిపాఠి ప్రారంభిం చారు.
ప్రపంచం గర్వించదగ్గ గొప్పుమేధావి బాబాసాహేబ్ అంబేడ్కర్ అని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. అంబేద్కర్ జయంతి సం దర్భంగా సోమవారం బస్టాండ్ చౌరస్తా వద్ద గల అంబే ద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా స్వామిక దేశమైన దేశానికి రాజ్యాంగాన్ని అందించారని, దేశాభివృద్ధికి అంబేడ్కర్ దిశానిర్ధేశం చేశారని తెలిపారు.
యువకులంతా అంబేడ్కర్ అడుగు జాడల్లో నడవాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నా రు. మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళుల ర్పించారు. అంబేడ్కర్ ఒక కులానికో మతానికో చెందిన వాడు కాదని ఆయన అందరి వాడన్నారు. దేశంలో రాజ్యాం గాన్ని మార్చే కుట్ర జరుగుతుందని, ప్రజలంతా కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న పదో తరగతి జవాబుపత్రాల మూల్యంకనం (స్పాట్)లో నిబంధనలను పాటించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా విద్యాధికారి సీహెచ్వీఎస్ జనార్ధన్రావు వైఖరితో మూల్యంకన కేంద్రం గందరగోళంగా మారిందని, స్పాట్లో పాల్గొంటున్న ఉపాధ్యాయులు మనోవేదనకు గురువుతున్నారని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.
ఉపాధిహామీ పథకాన్ని అమలు చేయడంలో క్షేత్రస్థాయిలో కీలక పాత్ర పోషించే ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యోగ భద్రత లేక ఇబ్బందులు పడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగ భద్రత కల్పించి పే స్కేల్ వర్తింప చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈనెల 14 తేదీ నుంచి దశల వారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్ణయించారు. ఆ మేరకు ఇటీవల పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిశాఖ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు.