Share News

Road Accdient: ఎర్రవల్లి చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా నలుగురు మృతి

ABN , Publish Date - Jun 01 , 2024 | 07:04 AM

డ్రైవర్ నిద్రమత్తో లేదంటే అతివేగం లేదంటే మరో కారణమో కానీ తెల్లవారేసరికి నలుగురి బతుకులు తెల్లారిపోయాయి. హైదరాబాద్‌కు ఆనందంగా బయలు దేరిన ఓ కుటుంబం దాదాపు గమ్యానికి చేరువలో ఉండగానే అంతులేని విషాదంలో మునిగిపోయింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి స్కార్పియో వాహనంలో ఏడుగురు వ్యక్తులు హైదరాబాద్‌కు బయలు దేరారు.

Road Accdient: ఎర్రవల్లి చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా నలుగురు మృతి

జోగులాంబ గద్వాల: డ్రైవర్ నిద్రమత్తో లేదంటే అతివేగం లేదంటే మరో కారణమో కానీ తెల్లవారేసరికి నలుగురి బతుకులు తెల్లారిపోయాయి. హైదరాబాద్‌కు ఆనందంగా బయలు దేరిన ఓ కుటుంబం దాదాపు గమ్యానికి చేరువలో ఉండగానే అంతులేని విషాదంలో మునిగిపోయింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి స్కార్పియో వాహనంలో ఏడుగురు వ్యక్తులు హైదరాబాద్‌కు బయలు దేరారు.

Pune accident case : డబ్బుకు వ్యవస్థ దాసోహం


స్కార్పియో వాహనం ఎర్రవల్లి చౌరస్తాలోని పెట్రోల్ పంపు దగ్గర జాతీయ రహదారిపై చేరుకునే సరికి ఊహించని ఘోర రోడ్డు ప్రమాదం. ఏమైందో ఏమో కానీ వాహన డ్రైవర్.. లారీని ఢీకొట్టాడు. నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి కూడా ఉన్నారు. హైదరాబాద్ వెళుతున్న సమయంలో లారీ ఢీకొని నలుగురు మృత్యువాత పడ్డారు.

AP High Court : ‘బ్యాలెట్‌’ ఉత్తర్వులు సరైనవే

Read more Telangana News and Telugu News

Updated Date - Jun 01 , 2024 | 10:03 AM