Share News

రేపటితో ముగియనున్న అఫిడవిట్ల దాఖలు గడువు

ABN , Publish Date - Jun 26 , 2024 | 06:09 AM

కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ ముందు విచారణకు హాజరైన వారికి అఫిడవిట్ల దాఖలుకు ఇచ్చిన గడువు ఈ నెల 27వ తేదీతో ముగియనుంది.

రేపటితో ముగియనున్న అఫిడవిట్ల దాఖలు గడువు

  • కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో కమిషన్‌

హైదరాబాద్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ ముందు విచారణకు హాజరైన వారికి అఫిడవిట్ల దాఖలుకు ఇచ్చిన గడువు ఈ నెల 27వ తేదీతో ముగియనుంది. ఇంజనీర్లు/నిర్మాణ సంస్థల ప్రతినిధులను కమిషన్‌ ఇప్పటికే విచారించింది. ఈ విచారణ క్రమంలో చెప్పిన అంశాలే అఫిడవిట్ల రూపంలో అందించాలని కమిషన్‌ ఇదివరకే స్పష్టం చేసింది. వాటిని దాఖలు చేయడానికి 27వ తేదీని గడువుగా విధించింది. అఫిడవిట్లు అందాక వాటిలోని సారాంశాలను పరిశీలించిన తర్వాత నోటీసులపై కమిషన్‌ నిర్ణయం తీసుకుంటుందని జస్టిస్‌ పీసీ ఘోష్‌ ఇదివరకే స్పష్టం చేశారు. మరోవైపు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పూర్తిస్థాయి నివేదిక కమిషన్‌కు అందే అవకాశం ఉండగా... రానున్న జూలై 7వ తేదీలోగా జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) కూడా పూర్తిస్థాయి నివేదికను సమర్పించే అవకాశాలున్నాయనే సమాచారం కమిషన్‌కు చేరింది.

Updated Date - Jun 26 , 2024 | 07:37 AM