విచారణకు రావాలంటూ కేసీఆర్‌కు మరో లేఖ..

ABN, Publish Date - Jun 26 , 2024 | 07:55 AM

హైదరాబాద్: విద్యుత్ కొనుగోళ్లపై విచారణ చేస్తున్న జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి కమిషన్ మాజీ సీఎం కేసీఆర్‌కు మరో లేఖ రాసింది. విద్యుత్ కొనుగోళ్ల అంశంపై మరింత సమాచారం ఇవ్వాలని ఈ నెల 19న లేఖ పంపించింది.

హైదరాబాద్: విద్యుత్ కొనుగోళ్లపై విచారణ చేస్తున్న జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి కమిషన్ మాజీ సీఎం కేసీఆర్‌కు మరో లేఖ రాసింది. విద్యుత్ కొనుగోళ్ల అంశంపై మరింత సమాచారం ఇవ్వాలని ఈ నెల 19న లేఖ పంపించింది. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై మరిన్ని వివరాలు తెలియజేయాలని ఆ లేఖలో పేర్కొంది. ఛత్తీస్‌గడ్ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్ గురించి మరింత సమాచారం కోరింది. ఇటీవల కమిషన్ ఎదుట పలువురు లేవనెత్తిన సందేహాలను లేఖలో ప్రస్తావించింది. లేఖపై ఈ నెల 27వ తేదీలోపు (గురువారం) సమాచారం ఇవ్వాలని కమిషన్ సూచించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

కుప్పంలో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన..

లోకేష్ ప్రజాదర్బార్‌కు విశేష స్పందన..

YS Jagan: శరణు... శరణు!

మోయలేనంత భారముంది!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 26 , 2024 | 07:55 AM