మేము చచ్చిపోతాం..కలెక్టర్ కి వృద్ద దంపతుల లేఖ

ABN, Publish Date - Oct 21 , 2024 | 08:57 PM

తమకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని ఓ వృద్ధ దంపతులు కలెక్టర్‌ను కోరారు. ఈ ఘటన ఏలూరులో చోటు చేసుకుంది. తాము చనిపోవాలనుకుంటున్నామని.. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని వారు కలెక్టర్‌ను కలిసి అభ్యర్థించారు. ఏలూరు రూరల్ మండలం గుడివాకలంకకు చెందిన సైదు ఇజ్రాయెల్, సైదు మహాలక్ష్మీ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారికి రెండు ఎకరాల భూమి ఉంది.

తమకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని ఓ వృద్ధ దంపతులు కలెక్టర్‌ను కోరారు. ఈ ఘటన ఏలూరులో చోటు చేసుకుంది. తాము చనిపోవాలనుకుంటున్నామని.. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని వారు కలెక్టర్‌ను కలిసి అభ్యర్థించారు. ఏలూరు రూరల్ మండలం గుడివాకలంకకు చెందిన సైదు ఇజ్రాయెల్, సైదు మహాలక్ష్మీ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారికి రెండు ఎకరాల భూమి ఉంది.


దానిని ఊరు పేరు మీద గ్రామ పెద్దలు సాగు చేస్తున్నారు. అయితే వీరి కుమారుడు అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహం జరిగింది. అతడు కరోనా సమయంలో మరణించాడు. దీంతో కోడలు పుట్టింటికి వెళ్లింది. నాటి నుంచి ఇజ్రాయెల్ దంపతులకు వేధింపులు ప్రారంభమైనాయి. దీంతో ఈ అంశాన్ని పరిశీలించి తగిన న్యాయం చేస్తామని ఆ దంపతులకు కలెక్టర్ హామీ ఇచ్చారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated at - Oct 21 , 2024 | 08:59 PM