నిడదవోలు సీఐ, ఎస్ఐ సస్పెండ్

ABN, Publish Date - Oct 19 , 2024 | 08:32 PM

పశ్చిమ గోదావరి జిల్లాలోని పలువురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. నిడదవోలు సర్కిల్ పెరవలి పరిధిలో పోలీసు ఉన్నతాధికారులతోపాటు సిబ్బంది పేకాట కేసులో చేతి వాటం చూపించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో వారిపై శాఖపరమైన విచారణ జరిగింది.

పశ్చిమ గోదావరి జిల్లాలోని పలువురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. నిడదవోలు సర్కిల్ పెరవలి పరిధిలో పోలీసు ఉన్నతాధికారులతోపాటు సిబ్బంది పేకాట కేసులో చేతి వాటం చూపించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో వారిపై శాఖపరమైన విచారణ జరిగింది. ఆరోపణలు రుజువు కావడంతో.. సీఐ శ్రీనివాసరావు, పెరవలి ఎస్ఐ అప్పారావుతోపాటు పెరవల్లి రైటర్, కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Oct 19 , 2024 | 09:09 PM