జోకర్‌లా మారిన జగన్.. |

ABN, Publish Date - Oct 18 , 2024 | 08:47 PM

పులివెందుల ఎమ్మెల్యే, మాజీ సీఎం వైఎస్ జగన్.. బుధవారం విలేకర్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు మూస ధోరణిలోనే ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండగానే కాదు.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సైతం నాటి ప్రతిపక్షాలపై దోచుకో.. పంచుకో.. తినుకో.. అంటూ వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలే మళ్లీ మళ్లీ చేస్తున్నారనే చర్చ జరుగుతుంది.

పులివెందుల ఎమ్మెల్యే, మాజీ సీఎం వైఎస్ జగన్.. బుధవారం విలేకర్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు మూస ధోరణిలోనే ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండగానే కాదు.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సైతం నాటి ప్రతిపక్షాలపై దోచుకో.. పంచుకో.. తినుకో.. అంటూ వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలే మళ్లీ మళ్లీ చేస్తున్నారనే చర్చ జరుగుతుంది.


అధికారంలో ఉన్న సమయంలో వ్యవహరించిన తీరుగానే ప్రస్తుతం వైఎస్ జగన్ వ్యవహార శైలి ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అమలు చేయాల్సిన హామీలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ పోరాటం చేయాల్సి ఉందనే చర్చ సాగుతుంది. కానీ అటువంటి వాటిని పక్కన పెట్టి.. వైఎస్ జగన్ మాత్రం పాత విధానంలోనే వెళ్లడం ఆయనకే నష్టమనే ప్రచారం సైతం సాగుతుంది.

Updated at - Oct 18 , 2024 | 08:47 PM