Share News

AP News: మంత్రి నారా లోకేష్ సమక్షంలో సిస్కోతో ఒప్పందం

ABN , Publish Date - Mar 25 , 2025 | 01:24 PM

రాష్ట్రంలోని వివిధ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య, వృత్తి విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల్లో ఐటీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రఖ్యాత ఐటీ సంస్థ సిస్కో, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య ఒప్పందం కుదిరింది. మంత్రి నారా లోకేశ్‌ సమక్షంలో ఎంవోయూ జరిగింది.

AP News: మంత్రి నారా లోకేష్ సమక్షంలో సిస్కోతో ఒప్పందం
Minister Nara Lokesh

అమరావతి: ఐటీ (IT), అడ్వాన్స్డ్ కోర్సుల్లో (Advanced Courses) నైపుణ్యాభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం (AP Govt.) సిస్కో (Cisco)తో ఒప్పందం (Agreement) కుదుర్చుకుంది. ఈ మేరకు ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) సమక్షంలో సిస్కో- ఏపీఎస్ఎస్ డీసీ (APSS DC) ఎంవోయు (MOU) జరిగింది. ఈ ఒప్పందం ద్వారా 50 వేల మంది యువతకు డిజిటల్, ఐటీ నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇస్తారు. విద్యార్థుల్లో ఐటి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రఖ్యాత ఐటి సంస్థ సిస్కో, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నడుమ ఒప్పందం జరిగింది. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఉండవల్లి నివాసంలో ఇరుపక్షాల ప్రతినిధులు ఎంవోయుపై సంతకాలు చేశారు.

Also Read..:

అసెంబ్లీ ముట్టడికి న్యాయవాదుల యత్నం.. పోలీసుల అరెస్టు..


ఈ ఒప్పందం ప్రకారం సిస్కో విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాలను విస్తరించడానికి నెట్‌వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, AI వంటి రంగాలలో అత్యాధునిక కంటెంట్‌ను అందిస్తోంది. అధికారుల్లోనూ డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించనుంది. ఆంధ్రప్రదేశ్ అంతటా విద్యార్థులకు వర్చువల్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లను అందిస్తుంది. ఏ కోర్సుల్లో శిక్షణ అందించాలో ఉన్నత విద్యాశాఖ నుంచి ప్రాధాన్యతల ఆధారంగా కోర్సుల జాబితాను ఖరారు చేస్తారు. అధికారుల్లోనూ డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించనుంది. ఆంధ్రప్రదేశ్ అంతటా విద్యార్థులకు వర్చువల్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లను అందిస్తుంది. ఉన్నత విద్యాసంస్థల్లో విద్యనభ్యసించే విద్యార్థులలో నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్యను ప్రోత్సహించడమే ఈ ఒప్పందం ముఖ్యోద్దేశం. నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా నైపుణ్యాల అంతరాన్ని తగ్గించడం, ఉపాధిని పెంపొందించడమే ఈ సహకారం లక్ష్యం.


ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్య సామర్థ్యాన్ని పెంపొందించేలా సిస్కో వర్చువల్ విధానంలో పోర్టల్‌ ద్వారా స్వీయ-అభ్యసన, బోధకుల నేతృత్వంలో ఇండస్ట్రీ ఎక్సోపోజర్ ప్రాక్టికల్ ఎక్స్ పీరియన్స్ కోర్సుల్లో శిక్షణ ఇస్తుంది. విద్యార్థులకు ఆయా సంస్థల డిమాండ్ ఆధారిత కోర్సుల్లో శిక్షణా కార్యక్రమాలను డిజైన్ చేస్తారు. మారుతున్న సాంకేతికలకు అనుగుణంగా ముందస్తు అవసరాలకు సరిపడా సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ నైపుణ్యాలను అభివృద్ధి చేయాలన్న ఏపీ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి.

వివిధ ప్రభుత్వ విభాగాల్లో అవసరాలకు అనుగుణంగా లెర్నర్ పార్టిసిపేషన్, కాంపిటీషన్స్, ఫ్యాకల్టీ ట్రైనింగ్, వర్క్స్ షాప్స్ నిర్వహణ వంటివి ఏపీఎస్ఎస్ డీసీ చేపడుతుంది. ఆయా కోర్సుల్లో విజయవంతంగా శిక్షణ పూర్తిచేసిన విద్యార్థులు, ఉద్యోగులకు సిస్కో సర్టిఫికెట్లను జారీచేస్తుంది. ఏపీఎస్ఎస్ డీసీ ద్వారా విద్యార్థులకు వర్చువల్ ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ లను అందిస్తారు. అధునాతన టెక్నాలజీలో యువత, విద్యార్థులకు మద్ధతునిచ్చే ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఫీచ‌ర్‌ (ఎఫ్‌వైఐఎఫ్‌) వంటి ప్రోగ్రామ్ లను సిస్కో సీఎస్ఆర్ నిధుల ద్వారా అందిస్తుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

రజినీ ఫిర్యాదుతోనే తనిఖీలు: జాషువా

మీర్‌పేట మాధవి హత్య కేసులో కీలక మలుపు..

ABN Live..: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

For More AP News and Telugu News

Updated Date - Mar 25 , 2025 | 01:24 PM