Home » Kutami
సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ఏపీఎస్ఆర్టీసీ నర్సీపట్నం డిపోలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తూ తన భర్త మరణించాడని, కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు బ్రెడ్ విన్నర్ స్కీమ్ వర్తింపజేస్తామని 2013లో యూనియన్తో జరిగిన అగ్రిమెంట్ అమలు చేయకపోవడంతో తమ కుటుంబం రోడ్డున పడిందని విశాఖకు చెందిన కె.రమాదేవి మంత్రి నారా లోకేష్ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు.
పట్టణ ప్రాంతాల్లో బుక్ చేసిన 24 గంటల లోపు.. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 48 గంటల లోపు గ్యాస్ డెలివరీ చేస్తారని మంత్రి నాడేండ్ల అన్నారు.ఆ తర్వాత సిలెండర్ డెలివరీ అయిన 48 గంటల్లోపు చెల్లించిన పూర్తి సొమ్మును లబ్దిదారుల ఖాతాల్లో తిరిగి జమ అవుతుందన్నారు. ఒక సంవత్సరంలో 3 గ్యాస్ సిలిండర్లు ఇలా ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు.
రాష్ట్రంలోని వివిధ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య, వృత్తి విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల్లో ఐటీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రఖ్యాత ఐటీ సంస్థ సిస్కో, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య ఒప్పందం కుదిరింది. మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఎంవోయూ జరిగింది.
ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనతో ఏపీ రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని, రాజధాని అమరావతిని అసలు పట్టించుకోలేదని మంత్రి నారాయణ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక ఇబ్బందులు వచ్చాయన్నారు. ఐఐటీ మద్రాస్ను పిలిపించి భవనాల నాణ్యత పరిశీలించి, కాంట్రాక్టర్లతో చర్చించి కొన్ని సమస్యలు పరిష్కరించామన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఎంప్లాయిస్కు రావలసిన GLI, GPF బకాయిలను విడుదల చేసింది. నేరుగా నిధులు వారి అకౌంట్లలో జమ అవుతున్నాయి. బకాయిలు అకౌంట్లలో జమ అవుతున్నట్లు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నేతలు ధృవీకరించారు.
‘నేను చెప్పింది చేయాల్సిందే... ప్రభుత్వ స్థలాన్ని అడ్డగోలుగా ఆక్రమించుకుని... భారీ భవంతిని నిర్మించుకున్నా సరే దానిని క్రమబద్ధీకరించాల్సిందే’... ఇదీ ఆ ఎమ్మెల్యే తీరు.. అలా కుదరదని చెప్పినందుకు... ఎమ్మెల్యే అధికారిపై రెచ్చిపోయారు. అసెంబ్లీలోనే ఇద్దరు సీనియర్ రెవెన్యూ అధికారులపై గొడవకు దిగారు.
మాజీ సిఎం జగన్ విశాఖపట్నం వస్తే పిల్లలను రోడ్డుపైకి తెచ్చి స్వాగతం పలికించుకునేవారని, రూసా గ్రాంట్స్, ఇస్రో గ్రాంట్ను దుర్వినియోగం చేశారని మంత్రి లోకేష్ విమర్శించారు. మాజీ వీసీ ప్రసాదరెడ్డి రూలింగ్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారని అన్నారు. దీనిపై ఇన్చార్జి వీసీ ఒక కమిటీని నియమించారని తెలిపారు.
ఎమ్మెల్సీ పదవిపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కామెంట్స్ చేశారు.పదవి రానంత మాత్రాన బాధ పడనని.. తనకు న్యాయం చేయడానికి చంద్రబాబుకు ఎప్పుడు ప్రయత్నిస్తారని, చంద్రబాబుతో తన ప్రయాణం 23 ఏళ్లుగా కొనసాగుతోందని వర్మ పేర్కొన్నారు.
ఏపీ శాసనమండలిలో దిశా చట్టం, దిశా యాప్పై అధికార... ప్రతిపక్ష నేతల మధ్య మాటలు యుద్ధం జరిగింది. దిశా యాప్ స్థానంలో శక్తి యాప్ తీసుకొస్తున్నామని హోం మంత్రి అనిత సభకు తెలిపారు. మహిళా దినోత్సవం రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ యాప్ను ప్రారంభిస్తున్నట్టు ఆమె చెప్పారు.
వైసీపీ నేతలపై మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీసీలకు గత వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా అన్యాయం చేసిందని, అమర్నాథ్ గౌడ్ను వైసీపీ ప్రభుత్వం ఎలా హత్య చేసిందో చర్చించేందుకు సిద్దమేనా అంటూ మంత్రి సవాల్ చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబు దిళితున్ని చంపి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేశారా లేదా.. వైసీపీ సభ్యుడు త్రిమూర్తులు చెప్పాలన్నారు.