Home » Nara Lokesh
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కు విశాఖపట్నంలో 21.6 ఎకరాలు భూమి కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం, ఎకరాకు కేవలం 99 పైసల లీజు నిర్ణయించింది 1370 కోట్లతో టీసీఎస్ ఆపరేషన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తూ, 12 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనుంది.
ప్రభుత్వ ఇంటర్ టాపర్లను మంత్రి లోకేశ్ అభినందిస్తూ వారిని ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రకటించారు. విద్యా సంస్కరణలు జూన్లో పూర్తవుతాయని, పీజీ ఫీజు రీయింబర్స్మెంట్ పునరుద్ధరించనున్నట్లు తెలిపారు.
Minister Nara Lokesh: మంగళగిరిని అన్ని రంగాల్లో అభివద్ధి చేస్తానని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నానని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
ఏపీలో శనివారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే ఈసారి ప్రభుత్వం వినూత్నంగా ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తోంది. వాట్సాప్ గవర్నెన్స్లో హాయ్ అని చెప్పడం ద్వారా విద్యార్థులు ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాలను తెలుసుకునేందుకు హాల్ టికెట్ నెంబర్ , డేట్ అఫ్ బర్త్ ఉంటే చాలు.
మంత్రి నారా లోకేశ్ మంగళగిరిలో లీప్ (LEAP) కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు, ఇందులో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక స్కూల్ను 50 రోజుల్లో అభివృద్ధి చేయాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఆత్రుతగా ఎదురు చూస్తోన్న ఇంటర్ పరీక్ష ఫలితాల విడుదలపై ఏపీ విద్య శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 12 శనివారం నాడు ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించారు. విద్యార్థులు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చని తెలిపారు. ఆ వివరాలు..
Minister Nara Lokesh: విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. విద్య వ్యవస్థ బలోపేతానికి కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
Nara Lokesh : మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మంత్రి నారా లోకేష్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పూలే సేవలను కొనియాడారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి విశేష కృషిచేశారని మంత్రి నారా లోకేష్ అన్నారు.
2019 అక్టోబర్ 22న ‘చినబాబు చిరుతిండి.. రూ. 25 లక్షలండి’ అనే శీర్షికతో సాక్షి దనపత్రికలో ఓ కథనం ప్రచురించారు. ఈ కథనం పూర్తిగా అవాస్తవాలతో ఉందని, ఉద్దేశపూర్వకంగా తన ప్రతిష్టను మంటకలపాలనే దురుద్దేశంతోనే ప్రచురించారంటూ సాక్షి దినపత్రికకు మంత్రి లోకేష్ రిజిస్టర్ నోటీసు పంపించారు. అయితే అటునుంచి ఎలాంటి వివరణ రాలేదు.
అమరావతిలో సొంత ఇంటి నిర్మాణానికి సీఎం చంద్రబాబు దంపతులు భూమి పూజ చేశారు. వెలగపూడిలో నూతన గృహానికి బుధవారం ఉదయం 8.51 గంటలకు వేద పండితులు వారి చేత భూమి పూజ చేయించారు. సుమార్ 5 ఎకరాల విస్తీర్ణంలో ఇంటిని నిర్మిస్తున్నారు. వెలగపూడి రైతుల నుంచి ఈ భూమిని చంద్రబాబు కొనుగోలు చేశారు.సచివాలయం వెనుక E6 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టనున్నారు.