IPL 2025: ఐపీఎల్ స్పెషల్ రీఛార్జ్ ప్లాన్స్.. జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఆఫర్లు చుశారా..
ABN , Publish Date - Mar 22 , 2025 | 06:49 PM
ఐపీఎల్ 2025 మొదలైన నేపథ్యంలో క్రికెట్ ప్రియుల కోసం టెలికాం సంస్థలు క్రేజీ రీఛార్జ్ ఆఫర్లను ప్రకటించాయి. 100 రూపాయల పరిధిలోనే దాదాపు అనేక సంస్థలు ఐపీఎల్ మ్యాచ్ చూసే సేవలను అందిస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

ఐపీఎల్ 2025 సందర్భంగా క్రీడాభిమానులను ఆకట్టుకునేందుకు టెలికాం కంపెనీలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి. మార్చి 22న మొదలైన ఐపీఎల్, మే వరకు కొనసాగనుంది. ఈ క్రమంలో క్రెకిట్ ప్రేమికుల ఆదరణ దక్కించుకునేందుకు జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా సంస్థలు క్రేజీ ఆఫర్లను ప్రవేశపెట్టాయి. ఈ క్రమంలో అందుబాటులో ఉన్న రీఛార్జ్ ప్లాన్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
జియో ప్లాన్
మీరు కేవలం రూ.100 చెల్లించి JioHotstar సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్లో మీకు డేటా కూడా లభిస్తుంది. ఈ జియో ప్లాన్లో వినియోగదారులకు 5 జీబీ డేటా లభిస్తుంది. మీరు 90 రోజుల చెల్లుబాటుతో ప్లాన్ పొందుతారు. అంటే కేవలం 100 రూపాయలతో, మీరు JioHotstarలో 90 రోజుల పాటు మ్యాచ్ చూడవచ్చు. అయితే, ఈ ప్లాన్లో వాయిస్ కాలింగ్, SMS సేవలు అందుబాటులో ఉండవు. మీకు కేవలం 5GB ప్రయోజనం లభిస్తుంది.
Vi సబ్స్క్రిప్షన్ ప్లాన్
ఇదే సమయంలో Viలో అత్యంత చౌకైన రూ.101 ప్లాన్ అందుబాటులో ఉంది. దీనిలో వినియోగదారులు Jiohotstar ఉచిత సభ్యత్వాన్ని పొందుతారు. ఈ ప్లాన్ లో యూజర్లకు జియో హాట్ స్టార్ 3 నెలలు ఉచితంగా లభిస్తుంది. ఇది కాకుండా, కంపెనీ వినియోగదారులకు 5GB డేటాను కూడా అందిస్తోంది. అయితే ఈ ప్లాన్లో వినియోగదారులు వాయిస్ కాలింగ్ సేవను పొందలేరు.
ఎయిర్టెల్ సబ్స్క్రిప్షన్ ప్లాన్
ఎయిర్టెల్ ఒక ప్లాన్ ధర రూ.100 కాగా, మరో ప్లాన్ ధర రూ.195. ఎయిర్టెల్ రూ.100 ప్లాన్ గురించి మాట్లాడుకుంటే, వినియోగదారుడు జియోహాట్స్టార్తో 30 రోజుల చెల్లుబాటుతో ఈ ప్లాన్ను పొందుతారు. అలాగే, ఈ ప్లాన్లో, వినియోగదారులు 5GB డేటా, 30 రోజుల పాటు ఉచిత JioHotstar మొబైల్ సబ్స్క్రిప్షన్ను పొందుతారు.
195 రూపాయల ప్లాన్ వాలిడిటీ 90 రోజులు. ఈ ప్లాన్ లో యూజర్ కు మొత్తం 15GB డేటా లభిస్తుంది. దీంతో పాటు, ఈ ప్లాన్తో కంపెనీ 90 రోజుల పాటు ఉచిత జియో హాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ను అందిస్తున్నారు. ఈ రెండు ప్లాన్లలో వాయిస్ కాలింగ్ సేవలు అందుబాటులో ఉండవు.
ఇవి కూడా చదవండి:
Earth Hour 2025: ఈరోజు ఎర్త్ అవర్..ఈ టైంలో కరెంట్ బంద్ చేసి, ప్రకృతికి సహకరిద్దాం..
WhatsApp: దేశంలో కోటి వాట్సాప్ ఖాతాలు తొలగింపు..ఇలా చేస్తే మీ అకౌంట్ కూడా..
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..
Read More Business News and Latest Telugu News