Vehicle Price Hike: షాకింగ్.. వచ్చే నెల నుంచి పెరగనున్న ఈ వాహనాల ధరలు
ABN , Publish Date - Mar 17 , 2025 | 11:22 AM
దేశంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, వాహన కొనుగోలు దారులకు షాక్ ఇచ్చే వార్తను తెలిపింది. ఈ క్రమంలో ఏప్రిల్ 2025 నుంచి తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు సోమవారం అధికారికంగా ప్రకటించింది.

భారతదేశంలో అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి సోమవారం కీలక ప్రకటన చేసింది. ఈ క్రమంలో తన వాహనాల ధరలను ఏప్రిల్ 2025 నుంచి పెంచుతున్నట్లు తెలిపింది. పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో ధరల పెంపు తీసుకున్నామని, ఇది మోడళ్ల తీరును బట్టి మారుతుందని ఆటోమొబైల్ సంస్థ వెల్లడించింది. మారుతి సుజుకి ఇండియా మార్చి 17న రెగ్యులేటరీ ఫైలింగ్లో ఈ విషయాన్ని ప్రకటించింది. ధరల పెంపు ప్రకటన తర్వాత మారుతి సుజుకి షేర్ల ధర దాదాపు 2% పుంజుకుంది.
మారుతి సుజుకి అమ్మకాలు
మారుతి సుజుకి ఫిబ్రవరి 2025లో మొత్తం 199,400 యూనిట్ల వాహనాలను విక్రయించింది. గత సంవత్సరం ఇదే నెలలో అమ్ముడైన 197,471 యూనిట్ల నుంచి 0.97% స్వల్ప వృద్ధిని నమోదు చేసింది. ఫిబ్రవరి 2025లో మొత్తం అమ్మకాలలో దేశీయ అమ్మకాలు 163,501 యూనిట్లు, ఇతర OEMలవి 10,878 యూనిట్ల అమ్మకాలు, 25,021 యూనిట్ల ఎగుమతులు ఉన్నాయి. ఈ క్రమంలో ఎగుమతులు సంవత్సరానికి 13.5% తగ్గుదల (YoY)ను నమోదు చేశాయి.
మారుతి సుజుకి స్టాక్ ధర పనితీరు
మారుతి సుజుకి షేర్ ధర ఒక నెలలో 9% కంటే ఎక్కువ పడిపోయింది. మారుతి సుజుకి షేర్లు ఆరు నెలల్లో 5.2% పడిపోగా, ఒక సంవత్సరం కాలంలో 1% స్వల్పంగా పెరిగాయి. కానీ తాజాగా ఈ స్టాక్ ధర పుంజుకుంది. గత రెండు సంవత్సరాలలో మారుతి సుజుకి స్టాక్ ధర 40% ర్యాలీ చేసింది. ఇదే క్రమంలో ఈ కంపెనీ స్టాక్ ఐదు సంవత్సరాలలో 107% మల్టీబ్యాగర్ రాబడిని అందించడం విశేషం.
మిగతా సంస్థలు కూడా..
అయితే తమ కస్టమర్లపై ప్రభావాన్ని తగ్గించడానికి కంపెనీ నిరంతరం కృషి చేస్తుందని, పెరిగిన ఖర్చులో కొంత భాగాన్ని మార్కెట్కు బదిలీ చేయాల్సి వస్తుందని కంపెనీ వెల్లడించింది. మారుతి సుజుకి మొత్తం దేశీయ ప్యాసింజర్ వెహికల్ (PV) అమ్మకాలు గత నెలలో 0.32% పెరిగి 160,791 యూనిట్లకు చేరుకున్నాయి. వచ్చే నెల నుంచి ఈ కంపెనీ వాహనాల ధరలు పెరిగనున్న నేపథ్యంలో మిగతా సంస్థలు కూడా ఇదే ధోరణి కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
Trump Putin: ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలపై ఈ వారమే ట్రంప్ పుతిన్ చర్చ..
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్టెల్కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News