2026 సెప్టెంబరు నాటికి పీఎఫ్బీఆర్ ప్లాంట్ రెడీ
ABN , Publish Date - Apr 20 , 2025 | 04:39 AM
తమిళనాడులోని కల్పాక్కంలో సిద్ధమవుతున్న భారతదేశపు మొట్టమొదటి ప్రోటోటైప్ ఫాస్ట్-బ్రీడర్ రియాక్టర్ (పీఎ్ఫబీఆర్) వచ్చే ఏడాది సెప్టెంబరు నాటికి అందుబాటులోకి రానుంది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: తమిళనాడులోని కల్పాక్కంలో సిద్ధమవుతున్న భారతదేశపు మొట్టమొదటి ప్రోటోటైప్ ఫాస్ట్-బ్రీడర్ రియాక్టర్ (పీఎ్ఫబీఆర్) వచ్చే ఏడాది సెప్టెంబరు నాటికి అందుబాటులోకి రానుంది. అణుశక్తి నియంత్రణ మండలి (ఏఈఆర్బీ) నుంచి అనుమతి లభించిన దాదాపు రెండేళ్ల తర్వాత.. దీన్ని వచ్చే ఏడాది ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. భారత అణుశక్తి లక్ష్యానికి ప్రోటోటైప్ ఫాస్ట్-బ్రీడర్ రియాక్టర్ చాలా ముఖ్యం.
ఇది అందుబాటులోకి వస్తే ఇంధన వనరులను సమర్థవంతంగా వాడుకోవచ్చు. అణు వ్యర్థాలను తగ్గించవచ్చు. కల్పాక్కంలో ఏర్పాటుచేస్తున్న పీఎ్ఫబీఆర్.. ప్లూటోనియం ఆధారిత మిశ్రమ ఆక్సైడ్ను ఇంధనంగా, ద్రవ సోడియంను శీతలకారిగా ఉపయోగించే మొట్టమొదటి అణు రియాక్టర్.