Hyderabad: హెచ్సీయూకు 100కోట్ల ఏఎన్ఆర్ఎఫ్ గ్రాంట్
ABN , Publish Date - Apr 18 , 2025 | 04:06 AM
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) మరో ఘనతను సొంతం చేసుకుంది. హెల్త్ అండ్ మెడికల్ టెక్నాలజీ్సలో పరిశోధన, ఆవిష్కరణల నిమిత్తం హెచ్సీయూ నేతృత్వంలోని బృందానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.100కోట్ల గ్రాంట్ మంజూరైంది.
వైద్యరంగంలో పరిశోధనల ప్రాజెక్టుకు కేటాయింపు
వర్సిటీ చరిత్రలో ఇదో మైలురాయి: వీసీ బీజే రావు
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) మరో ఘనతను సొంతం చేసుకుంది. హెల్త్ అండ్ మెడికల్ టెక్నాలజీ్సలో పరిశోధన, ఆవిష్కరణల నిమిత్తం హెచ్సీయూ నేతృత్వంలోని బృందానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.100కోట్ల గ్రాంట్ మంజూరైంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్- పార్టనర్షిప్స్ ఫర్ యాక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ (ఏఎన్ఆర్ఎ్ఫ-పెయిర్) సీఈవో నుంచి హెచ్సీయూ వీసీ బీజే రావుకు లేఖ అందింది.
ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఏడు హబ్-ఎన్-స్పోక్ మోడల్ ప్రాజెక్టుల్లో ఒకటిగా హెచ్సీయూ ప్రతిపాదించిన ప్రాజెక్టు ఎంపిక కావడం సంతోషంగా ఉందని, వర్సిటీ చరిత్రలో ఇదో మైలురాయిగా నిలిచిపోనుందని పేర్కొన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపు అత్యాధునిక, సహకార పరిశోధనల్లో యూనివర్సిటీ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఈప్రాజెక్టు డైరెక్టర్గా ప్రొఫెసర్ బ్రహ్మానందం మానవతి, కో-ప్రాజెక్ట్ డైరెక్టర్గా ప్రొఫెసర్ సిబా కుమార్ వ్యవహరిస్తారని, యూనివర్సిటీ ఆర్అండ్డీ డైరెక్టర్ ప్రొఫెసర్ సామ్రాట్ భాగస్వామ్య సంస్థలతో సమన్వయం చేస్తారని వెల్లడించారు