Home » Devotional
శ్రీ మన్మహారాజ రాజేశ్వరీదేవి యంకంబులో స్తన్య పానంబుతో తన్మయత్వంబునన్ అంతులేనట్టి వాత్సల్య దుగ్ధాంబుధిన్ దేలియాడంగనిన్ జేరి యర్చించు భక్తావళిన్ సర్వవిఘ్న ప్రకాండంబులన్ రూపుమాయించి నానా వరంబుల్ ప్రసాదించి ఈరేడు లోకాల శోకాలు మాన్పించి రక్షించుచున్నట్టి యో విఘ్నరాజా భవత్పాద మందార మకరంద
పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరిసంప దలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యతోను, తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిశారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహామునిని దర్శించి, నమస్కరించి ‘‘అయ్యా! మేము రాజ్యాధికారము, సమస్త వస్తు వాహనములను పోగొట్టుకున్నాము.
మన దేవతలలో మొదట పూజించేది గణేశుడినే. మొదట మనం స్మరించేది కూడా ఆయన్నే. పూర్ణకుంభం లాంటి ఆ దేహం, బానవంటి ఆ కడుపు, పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు. ఏనుగు తల, సన్నని కళ్ళు, సునిశిత పరిశీలనకు, మేథస్సుకు సంకేతాలు. ఆ వక్రతుండము, ఓంకార ప్రణవనాదానికి ప్రతీక.
(ఈ నామాలు చదువుతూ స్వామిని పూలతోగాని, అక్షతలతో గాని పూజించాలి. ఒకరు నామాలు చదువుతుండగా మిగిలిన వారు ఓం అనుకుంటూ పూజ చేయాలి.)
శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం | ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే || అగజానన పద్మార్కం గజానన మహర్నిశం | అనేక దంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే || ఖర్వం స్థూలతనుం గజేంద్రవదనం లంబోదరం సుందరం
నేడు (07-09-25024-శనివారం) వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
హిందూ సంప్రదాయంలోని అన్ని పండగలకు దాదాపుగా ప్రకృతితో ఏదో ఒక విధంగా సంబంధం కలిగి ఉంటుందన్నది సుస్పష్టం. శనివారం అంటే.. సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి పండగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.
Vinayaka Chavithi Special 2024: చవితి పర్వదినం సందర్బంగా 21 రకాల పత్రాలతో గణపతిని పూజిస్తారు. ఇలా 21 పత్రాలతో పూజించడాన్ని ఏకవింశతి పూజ అని పేర్కొంటారు. వినాయకుడిని ఇలా మతపరంగా పూజించినా.. శాస్త్రపరంగా దీని వెనుక అర్థం పరమార్థం దాగి ఉందని శాస్త్ర పండితులు పేర్కొంటున్నారు.
రేపే వినాయక చవితి. దేశవ్యాప్తంగా ఊరు వాడా వినాయకుడి పందిళ్లుతో ముస్తాబవుతుంది. వివిధ రకాల భారీ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. చిన్నా పెద్దలంతా కలిసి ఈ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ప్రతీ ఇంట్లో వినాయకుడి ప్రతిమను ప్రతిష్టించి ఆ కుటుంబ సభ్యులు పూజలు నిర్వహిస్తారు.
గణేశుడికి మొదటి పూజతోనే ఏదైనా శుభ కార్యాలు ప్రారంభించాలని.. అప్పుడే అవి ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయని భక్తుల నమ్మకం. అందుకే వివాహానికి సంబంధించి మొదటి శుభ లేఖను విఘ్నేశ్వరుడి చెంత ఉంచుతారు.